AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజకీయ పార్టీలకు ఈసీ లేఖ.. మేటర్ ఇదే!

తెలంగాణలోని అన్ని ప్రధాన పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖలు రాసింది. సోమవారం ఈ మేరకు అన్ని ప్రధాన పార్టీల అధ్యక్షులకు లేఖలను పంపించారు ఎన్నికల సంఘం అధికారులు. దీంతో రాష్ట్రంలో ఎన్నికల దిశగా అడుగులు పడుతున్నట్లు స్పష్టమైంది.

రాజకీయ పార్టీలకు ఈసీ లేఖ.. మేటర్ ఇదే!
Rajesh Sharma
|

Updated on: Sep 21, 2020 | 6:03 PM

Share

తెలంగాణలోని అన్ని ప్రధాన పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖలు రాసింది. సోమవారం ఈ మేరకు అన్ని ప్రధాన పార్టీల అధ్యక్షులకు లేఖలను పంపించారు ఎన్నికల సంఘం అధికారులు. దీంతో రాష్ట్రంలో ఎన్నికల దిశగా అడుగులు పడుతున్నట్లు స్పష్టమైంది.

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పాలక మండలి పదవీ కాలం ఫిబ్రవరి, 2020తో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. రాజకీయ పార్టీలు కూడా తమతమ కసరత్తును ఇప్పటికే మొదలు పెట్టగా.. ఈసీ సైతం ఎన్నికల నిర్వహణ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు లేఖలు రాసింది.

రానున్న జీహెచ్ఎంసిీ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖలు పంపింది. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతో నిర్వహించాలా లేక ఈవీఎంల ద్వారా నిర్వహించాలా అన్న విషయంలో రాజకీయ పార్టీ తమ అభిప్రాయాలను తెలుపాలన్నది ఈసీ రాసిన లేఖల సారాంశం. ఎన్నికల నిర్వహణ కసరత్తులో ముందుగా తేలాల్సిన అంశంగా దీనిని ప్రాధాన్యతగా తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుగా రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు యత్నిస్తోంది.

సెప్టెంబర్ 30వ తేదీ లోపు రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు తెలపాలని, ఏమైనా సూచనలు వుంటే తెలియజేయాలని ఈసీ లేఖలో పేర్కొన్నది. 30వ తేదీ తరువాత ఇచ్చే సూచనలు పరిగణనలోకి తీసుకోబడవని ఎన్నికల అధికారి తేల్చి చెప్పడం విశేషం.

Follow Us
చిప్స్ ప్యాకెట్లో ఉండే గాలిలో ఇంత కథ ఉందా.. అసలేం వాడతారో తెలుసా?
చిప్స్ ప్యాకెట్లో ఉండే గాలిలో ఇంత కథ ఉందా.. అసలేం వాడతారో తెలుసా?
ఆ వ్యక్తి వల్లే పూరి జగన్నాథ్ అప్పుల పాలయ్యాడు: రఘు కుంచె
ఆ వ్యక్తి వల్లే పూరి జగన్నాథ్ అప్పుల పాలయ్యాడు: రఘు కుంచె
ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో భక్తులు నేలపైనే ప్రసాదం ఎందుకు తింటారు?..
ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో భక్తులు నేలపైనే ప్రసాదం ఎందుకు తింటారు?..
మా పెద్దిని కాపాడండి: ​వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన కేసీఆర్
మా పెద్దిని కాపాడండి: ​వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన కేసీఆర్
వానాకాలంలో గ్యాస్ సిలిండర్ ఇలా వాడితే.. చాలా వరకు ఆదా చేయవచ్చు!
వానాకాలంలో గ్యాస్ సిలిండర్ ఇలా వాడితే.. చాలా వరకు ఆదా చేయవచ్చు!
అంగన్‌వాడీ ఉద్యోగాలకు అప్లై చేయండి.. అమ్మాయిలకు మాత్రమే ఛాన్స్‌!
అంగన్‌వాడీ ఉద్యోగాలకు అప్లై చేయండి.. అమ్మాయిలకు మాత్రమే ఛాన్స్‌!
గురువు కటాక్షం.. అక్టోబర్ కల్లా వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..
గురువు కటాక్షం.. అక్టోబర్ కల్లా వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..
IRCTC అయోధ్య టూర్ ప్యాకేజీ: వందే భారత్‌లో రామ్ లల్లా దర్శనం..
IRCTC అయోధ్య టూర్ ప్యాకేజీ: వందే భారత్‌లో రామ్ లల్లా దర్శనం..
కట్టిన ఇల్లు కొనేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే
కట్టిన ఇల్లు కొనేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే
జూలై 31 నుంచి ICET 2026 తొలి విడత కౌన్సెలింగ్‌.. పూర్తి షెడ్యూల్‌
జూలై 31 నుంచి ICET 2026 తొలి విడత కౌన్సెలింగ్‌.. పూర్తి షెడ్యూల్‌