AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉప్పల్‌లో కోటి రూపాయలతో లైబ్ర‌రీ నిర్మాణం

తెలంగాణ సర్కార్ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. యువతలో పఠన శక్తిని పెంచేందుకు నూతన గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా  ఉప్ప‌ల్ ప‌రిధిలోని బీర‌ప్ప‌గ‌డ్డ‌లో నూత‌న గ్రంథాల‌యం..

ఉప్పల్‌లో కోటి రూపాయలతో లైబ్ర‌రీ నిర్మాణం
Sanjay Kasula
|

Updated on: Sep 21, 2020 | 6:33 PM

Share

తెలంగాణ సర్కార్ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. యువతలో పఠన శక్తిని పెంచేందుకు నూతన గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా  ఉప్ప‌ల్ ప‌రిధిలోని బీర‌ప్ప‌గ‌డ్డ‌లో నూత‌న గ్రంథాల‌యం నిర్మాణ ప‌నుల‌కు మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, మ‌ల్లారెడ్డి శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ జ‌నార్ధ‌న్ రెడ్డి, రాష్ర్ట గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ శ్రీధ‌ర్ పాల్గొన్నారు.

శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణ‌యం మేర‌కు విద్యార్థులు, యువ‌త‌లో పుస్త‌క ప‌ఠ‌న శ‌క్తి పెరిగేలా ఆధునిక స‌దుపాయాలు, టెక్నాల‌జీతో గ్రంథాల‌యాలు ఏర్పాటు చేస్తున్నామ‌ని అన్నారు. కోటి రూపాయాల‌తో ఉప్ప‌ల్‌లో లైబ్ర‌రీ నిర్మిస్తున్నామన్నారు.

ఇత‌ర ప్రాంతాల్లో స్థ‌లాలు గుర్తిస్తే నూత‌న లైబ్ర‌రీలు నిర్మిస్తామ‌ని వెల్లడించారు. కరోనా నేప‌థ్యంలో అమ‌లు చేస్తున్న డిజిట‌ల్ త‌ర‌గ‌తుల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింద‌ని అన్నారు. వ‌చ్చే వారం నుంచి దూర‌ద‌ర్శ‌న్‌లో ఇంగ్లీష్‌, ఉర్దూ మీడియం ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు ప్రారంభ‌మవుతాయ‌ని అన్నారు. సెల‌వుల కార‌ణంగా విద్యార్థులు న‌ష్ట‌పోకుండా ఆన్‌లైన్ క్లాసుల నిర్వ‌హ‌ణ చేప‌ట్టామ‌ని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే డిజిటల్ లైబ్రరీ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

Follow Us