8 మంది పర్వతారోహకులు గల్లంతు… రంగంలోకి ఎయిర్ఫోర్స్
హిమాలయాలలోని నందాదేవి పర్వతాన్ని అధిరోహించేందుకు వెళ్లిన 8 మంది పర్వతారోహకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే భారత వాయుసేనకు చెందిన రెండు హెలికాప్టర్లు రంగంలోకి దిగి గాలింపు చర్యలు మొదలుపెట్టాయి. అయినా వారి ఆచూకీ లభ్యం కాలేదు. గల్లంతైన వారిలో ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా, భారత్కు చెందిన పర్వతారోహకులు ఉన్నారు. శనివారం వీరి పర్వతారోహణ ప్రారంభం కాగా బేస్ క్యాంప్కు చేరుకోకపోవడంతో ఆందోళన మొదలైంది. గల్లంతైన వారి కోసం హెలికాప్టర్లో తొలి ఏరియల్ రెక్కీ నిర్వహించిన విజయ్ […]
హిమాలయాలలోని నందాదేవి పర్వతాన్ని అధిరోహించేందుకు వెళ్లిన 8 మంది పర్వతారోహకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే భారత వాయుసేనకు చెందిన రెండు హెలికాప్టర్లు రంగంలోకి దిగి గాలింపు చర్యలు మొదలుపెట్టాయి. అయినా వారి ఆచూకీ లభ్యం కాలేదు. గల్లంతైన వారిలో ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా, భారత్కు చెందిన పర్వతారోహకులు ఉన్నారు.
శనివారం వీరి పర్వతారోహణ ప్రారంభం కాగా బేస్ క్యాంప్కు చేరుకోకపోవడంతో ఆందోళన మొదలైంది. గల్లంతైన వారి కోసం హెలికాప్టర్లో తొలి ఏరియల్ రెక్కీ నిర్వహించిన విజయ్ కుమార్ జోగ్దానంద మాట్లాడుతూ.. బేస్ క్యాంపులో కొన్ని టెంట్లు మాత్రమే కనిపించాయని, మనుషుల జాడ కనిపించలేదని పేర్కొన్నారు. దీంతో మరోమారు రెక్కీ నిర్వహించేందుకు రెండో హెలికాప్టర్ బయలుదేరింది. అయితే వీరి జాడ కనుగొనేందుకు పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది, అధికారులతో కూడిన 15 మంది బృందం బయలుదేరినట్టు ఉత్తరాఖండ్కు చెందిన విపత్తు నిర్వహణ బృందం అధికారి తృప్తి భట్ తెలిపారు. ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీసులు భారత వాయుసేన సహకారంతో నలుగురు పర్వతారోహకులను రక్షించారు.
Uttarakhand: Indo-Tibetan Border Police with the help of Indian Air Force has rescued four climbers from Nanda Devi Base Camp. The climbers have been brought to Pithoragarh. pic.twitter.com/9gSeNMPIL0
— ANI (@ANI) June 2, 2019