అంపైర్‌ను దూషించిన సర్ఫరాజ్, మ్యాచ్ ఫీజులో కోత

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్​ వ్యవహారశైలి చాలా వివాదాస్పదంగా ఉంటుంది. అతడు చేసే పనులు, చేష్టలు చర్చనీయాంశమవుతూ ఉంటాయి.

అంపైర్‌ను దూషించిన సర్ఫరాజ్, మ్యాచ్ ఫీజులో కోత
Follow us

|

Updated on: Nov 08, 2020 | 7:22 PM

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్​ వ్యవహారశైలి చాలా వివాదాస్పదంగా ఉంటుంది. అతడు చేసే పనులు, చేష్టలు చర్చనీయాంశమవుతూ ఉంటాయి. తాజాగా అంపైర్‌ని దూషించి వార్తల్లోకి ఎక్కాడు సర్ఫరాజ్. ఈ క్రమంలో పాక్ క్రికెట్ బోర్డు అతడి మ్యాచ్​ ఫీజులో 35 శాతం కోత విధించింది. క్వైద్​-ఈ- ఆజామ్ ట్రోఫీలోని ఓ మ్యాచ్​లో అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టి.. అతడిని దూషించాడమే ఇందుకు కారణమని బోర్డు పేర్కొంది. సింధ్ ఫస్ట్ ఎలెవన్​ జట్టుకు సారథిగా ఉన్న సర్ఫరాజ్​.. శనివారం జరిగిన మ్యాచ్​లో అసభ్యకరమైన పదజాలం ఉపయోగించాడు.

“అంపైర్​ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన సర్ఫరాజ్.. పలుమార్లు అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు. అంపైర్లుగా ఉన్న ఫైజల్​ అఫ్రిది, సకిబ్ ఖాన్​ పాకిస్థాన్​ బోర్డుకు కంప్లైంట్ చేశారు. బోర్డు నియమావళిలోని ఆర్టికల్​ 2.21 ప్రకారం సర్ఫరాజ్ నిబంధనలు​ అతిక్రమించాడు” అని పీసీబీ​ వెల్లడించింది.

Also Read :

దిండు కింద ఫోన్‌ పేలి వ్యక్తికి తీవ్ర గాయాలు

రాయ్ లక్ష్మి తండ్రి కన్నుమూత..నటి ఎమోషనల్ పోస్ట్

రెండోసారి కరోనా సోకి కడప డాక్టర్ మృతి