AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలెర్ట్ : ఉత్తర, తూర్పు తెలంగాణలో ఈ రోజు అతి భారీ వర్షాలు

ఇప్ప‌టికే భారీ వ‌ర్షాలు వ‌ర‌ద‌ల‌తో అల్లాడుతండ‌గా మ‌రో షాకింగ్ న్యూస్ చెప్పింది వాతావ‌ర‌ణ శాఖ‌. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, తీవ్ర అల్పపీడనంగా మారి వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న‌ట్లు వెల్ల‌డించింది.

అలెర్ట్ : ఉత్తర, తూర్పు తెలంగాణలో ఈ రోజు అతి భారీ వర్షాలు
Ram Naramaneni
|

Updated on: Aug 19, 2020 | 2:44 PM

Share

ఇప్ప‌టికే భారీ వ‌ర్షాలు వ‌ర‌ద‌ల‌తో అల్లాడుతండ‌గా మ‌రో షాకింగ్ న్యూస్ చెప్పింది వాతావ‌ర‌ణ శాఖ‌. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, తీవ్ర అల్పపీడనంగా మారి వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న‌ట్లు వెల్ల‌డించింది. దీని ప్ర‌భావంతో ఉత్తర, తూర్పు తెలంగాణలో ఈ రోజు అతి భారీ వర్షాలు కురుస్తాయ‌ని వివ‌రించింది. అల్ప‌పీడ‌నానికి అనుబంధంగా 7.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపింది. 24 గంటల్లో అల్పపీడనం పశ్చిమ దిశగా పయనించి వాయుగుండంగా మారే అవకాశం ఉంద‌ని పేర్కొంది. ఆగస్టు 23న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ బాంబ్ పేల్చింది.

కాగా ప్ర‌స్తుతం ఉన్న తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, ఉత్తర కోస్తా ఆంధ్రాలో మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయ‌ని వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ రాజారావు చెప్పారు. ఇప్ప‌టికే కురిసిన భారీ వ‌ర్షాల‌కు ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో వ‌ర‌దలు ముంచెత్తుతున్నాయి. వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. ప‌లు గ్రామాల మ‌ధ్య రాక‌పోక‌లు నిలిచిపోయాయి.

Also Read :

ఇసుక విధానంలో మార్పులు, మ‌రోసారి జ‌గ‌న్ మార్క్ నిర్ణ‌యాలు !

దారుణం : కూతురి అభ్యంతకర చిత్రాలు ల్యాప్‌టాప్‌లో బంధించిన తండ్రి

ధైర్య‌మే బ‌లం : కరోనాను జయించిన 103 ఏళ్ల వృద్ధుడు