AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్నాటకలో రాష్ట్రపతి పాలన విధిస్తారా.. ?

కర్నాటక రాజకీయం ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపించి ఎన్నో అనుమానాలకు తావిచ్చింది. బలపరీక్షలో విశ్వాసాన్ని కోల్పోయిన జేడీఎస్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం తరపున కుమారస్వామి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మరోవైపు తాము కొత్తగా ప్రభుత్వంలోకి రాబోతున్నామని బీజేపీ పక్షనేత యడ్యూరప్ప ఇప్పటికే ప్రకటించారు. అయితే రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కొనసాగుతున్న అనిశ్చితికి ఫుల్‌స్టాప్ పెట్టేలా రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నట్టు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే విశ్వాస […]

కర్నాటకలో  రాష్ట్రపతి పాలన విధిస్తారా.. ?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 25, 2019 | 6:55 PM

Share

కర్నాటక రాజకీయం ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపించి ఎన్నో అనుమానాలకు తావిచ్చింది. బలపరీక్షలో విశ్వాసాన్ని కోల్పోయిన జేడీఎస్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం తరపున కుమారస్వామి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మరోవైపు తాము కొత్తగా ప్రభుత్వంలోకి రాబోతున్నామని బీజేపీ పక్షనేత యడ్యూరప్ప ఇప్పటికే ప్రకటించారు. అయితే రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కొనసాగుతున్న అనిశ్చితికి ఫుల్‌స్టాప్ పెట్టేలా రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నట్టు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉంటే విశ్వాస పరీక్షలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు కుమారస్వామి ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని గవర్నర్ వాజూభాయ్ వాలా కోరారు. అయితే కుమారస్వామి ఆ పదవిలో కొనసాగుతూ పలు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారని, ఆయనకు ఎలాంటి అధికారాలు లేవని బీజేపీ ఆరోపణలు చేస్తోంది. ఈమేరకు బీజేపీ అధికార ప్రతినిధి జి. మధుసూదన్ మాట్లాడుతూ కుమారస్వామి వైఖరి అనైతికంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం ఏర్పడే వరకు కర్నాటకలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే రాజీనామాలు చేసిన రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకునేవరకు రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.

రాష్ట్రంలో ఏ పార్టీకి సరైన మెజార్టీ లేనప్పుడు, రాజ్యాంగ వ్యవస్థలు విఫలమైనప్పుడు ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తారు. అలాగే శాంతిభద్రతలకు విఘాతం కలినప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏపార్టీ ముందుకు రానప్పుడు, సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినప్పడు దీన్ని ప్రయోగిస్తారు. ఇప్పటివరకు కర్నాటకలో రాష్ట్రపతి పాలన ఆరుసార్లు విధించారు. రాష్ట్రపతి పాలన సమయంలో గవర్నర్ ఇద్దరు సలహాదార్లను నియమిస్తారు. రాష్ట్ర కేబినెట్ వ్యవహారాలను గవర్నర్, సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వర్తిస్తారు.