ప్రజ్ఞాసింగ్కు అస్వస్థత.. కోర్టుకు గైర్హాజర్
సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ అస్వస్థకు గురయ్యారు. భోపాల్ నుంచి దిగ్విజయ్ సింగ్పై పోటీ చేసి ఘన విజయం సాధించారు. బుధవారం రాత్రి కడుపునొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరిన ఆమె.. ఇవాళ ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఓ కార్యక్రమం కోసం ఆమె ఆస్పత్రి నుంచి బయటికి వెళ్లారనీ.. మళ్లీ వెంటనే తిరిగి వస్తారని ప్రజ్ఞ సన్నిహితురాలు ఒకరు పేర్కొన్నారు. కాగా, మాలెగావ్ పేలుళ్ల కేసులో ఈ వారం విచారణకు హాజరు కావాలంటూ ముంబై స్పెషల్ కోర్టు విధించిన […]
సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ అస్వస్థకు గురయ్యారు. భోపాల్ నుంచి దిగ్విజయ్ సింగ్పై పోటీ చేసి ఘన విజయం సాధించారు. బుధవారం రాత్రి కడుపునొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరిన ఆమె.. ఇవాళ ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఓ కార్యక్రమం కోసం ఆమె ఆస్పత్రి నుంచి బయటికి వెళ్లారనీ.. మళ్లీ వెంటనే తిరిగి వస్తారని ప్రజ్ఞ సన్నిహితురాలు ఒకరు పేర్కొన్నారు.
కాగా, మాలెగావ్ పేలుళ్ల కేసులో ఈ వారం విచారణకు హాజరు కావాలంటూ ముంబై స్పెషల్ కోర్టు విధించిన గడువు రేపటితో ముగియనుంది. మరోవైపు కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఆమె పెట్టుకున్న పిటిషన్ కూడా తిరస్కరణకు గురైంది. విచారణ తుది దశకు చేరుకున్నందున ఆమె హాజరు కావాల్సిందేనంటూ ఎన్ఐఏ ప్రత్యేక న్యాయమూర్తి స్పష్టం చేశారు.