AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అన్నదాత సుఖీభవ’కు మంగళం..!

వ్యవసాయశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా పలు నిర్ణయాలను తీసుకున్నారు. ముందుగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అన్నదాత సుఖీభవ పథకాన్ని’ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కాగా.. అక్టోబర్ నెల 15వ తేదీ నుంచి రైతులకు రూ.12,500లు ఇచ్చే ‘రైతు భరోసా’ కార్యక్రమం ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అలాగే.. నకిలీ విత్తనాల చలామణిపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాల వ్యాపారులను కఠినంగా శిక్షించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. […]

'అన్నదాత సుఖీభవ'కు మంగళం..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 06, 2019 | 1:38 PM

Share

వ్యవసాయశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా పలు నిర్ణయాలను తీసుకున్నారు. ముందుగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అన్నదాత సుఖీభవ పథకాన్ని’ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కాగా.. అక్టోబర్ నెల 15వ తేదీ నుంచి రైతులకు రూ.12,500లు ఇచ్చే ‘రైతు భరోసా’ కార్యక్రమం ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అలాగే.. నకిలీ విత్తనాల చలామణిపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాల వ్యాపారులను కఠినంగా శిక్షించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. అంతేగాక.. రైతులకు కనీస మద్దతు ధర సంపూర్ణంగా అందేలా, తగు న్యాయం జరిగిలే అన్నిరకాల చర్యలు తీసుకోవాలి తెలిపారు. రూ.3000 కోట్ల రూపాయలతో మార్కెట్ స్థిరీకరణ నిధిని బడ్జెట్‌లో పెడతామని, రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ఈ నిధి ద్వార ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు సీఎం జగన్.