కరోనా కాలంలో ఎంత నష్టపోయిందో తెలుసా..

టాలీవుడ్ లో వ‌రుస ఆఫ‌ర్ల‌తో బిజీగా ఉన్న హీరోయిన్ పూజా హెగ్డే. ఓ వైపు తెలుగు చిత్రాలు చేస్తూనే హిందీ సినిమాల్లో కూడా దుమ్ము రేపుతోంది. త‌న అందం, న‌ట‌న‌తో ఆక‌ట్టుకునే ఈ బ్యూటీ ప్ర‌స్తుతం అఖిల్‌తో క‌లిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రంలో

కరోనా కాలంలో ఎంత నష్టపోయిందో తెలుసా..
Follow us

|

Updated on: Aug 28, 2020 | 5:39 PM

కుర్రకారును ఉర్రూతలూగిస్తున్న పూజా హెగ్డే ఈ మధ్య చాలా నష్టపోయిందట. కేవలం ఈ 6 నెల‌ల్లో రూ.5 కోట్లు నష్టపోయిందట. కరోనా వ్యాప్తి కారణంగా షూటింగ్స్ లేక పోవడంతో ఇంతలా నష్టం జరిగిందట. ఇటు టాలీవుడ్‌లోనూ..  అటు బాలీవుడ్‌లో మంచి డిమాండ్ తో దూసుకుపోతున్న ఈ చిన్నది.. కరోనా తెచ్చిన కష్టంతో ఇబ్బందులు పడుతోందట. దేశంలోనే అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్‌గా ముద్రవేసుకుంది పూజా భామా.

టాలీవుడ్ లో వ‌రుస ఆఫ‌ర్ల‌తో బిజీగా ఉన్న హీరోయిన్ పూజా హెగ్డే. ఓ వైపు తెలుగు చిత్రాలు చేస్తూనే హిందీ సినిమాల్లో కూడా దుమ్ము రేపుతోంది. త‌న అందం, న‌ట‌న‌తో ఆక‌ట్టుకునే ఈ బ్యూటీ ప్ర‌స్తుతం అఖిల్‌తో క‌లిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రంలో న‌టిస్తోంది. మ‌రోవైపు ప్ర‌భాస్ తో రాధేశ్యామ్ మూవీ చేస్తోంది. ఈ సినిమా షూట్ లో జాయిన్ అయ్యేందుకు రెడీగా ఉంది. వీటితోపాటు మ‌రో మూడు చిత్రాల‌కు ఇప్పటికే సంత‌కం చేయాల్సి ఉండ‌గా..రాధేశ్యామ్ ఆఫ‌ర్ రావ‌డంతో వెంట‌నే ఒకే చేసింద‌ట‌. అటు బాలీవుడ్‌లోనూ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో ఓ సినిమా చేస్తోంది.

ఇండియాలో అత్య‌ధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ల‌లో ఒక‌రిగా ఉన్న పూజా హెగ్డే లాక్ డౌన్  సమయంలో గ‌త 6 నెల‌ల కాలంలో సుమారు రూ.5 కోట్ల వ‌ర‌కు ఆదాయాన్ని కోల్పోయింద‌ని ఫిల్మ్‌ నగర్ టాక్.  సెప్టెంబ‌ర్ మొదటి వారంలో రాధేశ్యామ్ చిత్రం షూటింగ్ షురూ కానున్న‌ట్టు తెలుస్తోంది.