AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా

వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యేకి కరోనా సోకింది. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఇదే విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు

పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా
Balaraju Goud
|

Updated on: Jul 03, 2020 | 7:32 PM

Share

కరోనా మహమ్మారి ధాటికి జనం బెంబెలేత్తున్నారు. సామాన్యుడి నుంచ సెలబ్రేటీల దాకా కొవిడ్ బారిన పడుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉండే నేతలు సైతం కరోనా కాటుకు గురవుతున్నారు. తాజాగా వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యేకి కరోనా సోకింది. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఇదే విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. గురువారం నాడు కరోనా టెస్టులు చేయించుకున్నాని, కలెక్టరేట్‌లో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌కి వెళ్లినప్పుడు ఈ విషయంపై తనకు సమాచారం అందిందన్నారు. అయితే తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యాంగానే ఉన్నానని రోశయ్య తెలిపారు. హోం క్వారంటైన్ ఉన్నానని, త్వరలో కోలుకుంటానని రోశయ్య తెలిపారు. ఇదిలాఉండగా, ఎమ్మెల్యే రోశయ్యకు కరోనా పాజిటివ్ అనే సమాచారం తెలియడంతో కలెక్టరేట్‌లో మీటింగ్‌కు హాజరైన హోంమంత్రితో పాటు మరి కొందరు ప్రజాప్రతినిధుల్లో టెన్షన్ పట్టుకుంది.