AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీడియాపై దాడి.. పోలీసు కేసులు నమోదు.!

అమరావతి రాజధాని మార్పు చేయొద్దంటూ రైతులు చేపడుతున్న ఆందోళనలను ఉద్దండరాయునిపాలెంలో కవరేజ్ చేసేందుకు వెళ్లిన మీడియా వాహనంపై.. ఇవాళ ఉదయం ఆందోళనకారులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఒకేసారి 30 నుంచి 40 మంది ఆందోళనకారులు కారుపై దాడికి దిగి కర్రలతో కారు అద్దాలను ధ్వంసం చేయడంతో అందులో ఉన్న జర్నలిస్టులు గాయాలపాలయ్యారు. కాగా, ఈ ఘటనపై తుళ్లూరు పీఎస్‌లో రెండు కేసులు నమోదు అయ్యాయి. సెక్షన్ 323, 353, 143, 427, 341, 307, కింద […]

మీడియాపై దాడి.. పోలీసు కేసులు నమోదు.!
Ravi Kiran
|

Updated on: Dec 27, 2019 | 9:52 PM

Share

అమరావతి రాజధాని మార్పు చేయొద్దంటూ రైతులు చేపడుతున్న ఆందోళనలను ఉద్దండరాయునిపాలెంలో కవరేజ్ చేసేందుకు వెళ్లిన మీడియా వాహనంపై.. ఇవాళ ఉదయం ఆందోళనకారులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఒకేసారి 30 నుంచి 40 మంది ఆందోళనకారులు కారుపై దాడికి దిగి కర్రలతో కారు అద్దాలను ధ్వంసం చేయడంతో అందులో ఉన్న జర్నలిస్టులు గాయాలపాలయ్యారు. కాగా, ఈ ఘటనపై తుళ్లూరు పీఎస్‌లో రెండు కేసులు నమోదు అయ్యాయి. సెక్షన్ 323, 353, 143, 427, 341, 307, కింద తుళ్లూరు పోలీసులు ఈ కేసులను నమోదు చేశారు.

ఒకసారి సెక్షన్లు పరిశీలిస్తే…

సెక్షన్ 323.. చేతులతో,కాళ్ళతో తన్నడం

సెక్షన్ 353… విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను అడ్డుకున్నందుకు

సెక్షన్ 143.. ఐదు మంది కన్నా ఎక్కువ మంది గుమ్ముగూడినందుకు

సెక్షన్ 427… ప్రాపర్టీ డ్యామేజి

సెక్షన్ 341… అక్రమంగా అడ్డుకున్నందుకు

సెక్షన్ 307… హత్యాయత్నం చెయ్యడానికి ప్రయత్నం చేసినందుకు