AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్ ఫ్యాన్స్‌కి ఇది పండగే..!

నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్రాన్స్‌కి ఇది నిజంగా పండగలాంటి వార్త అనే చెప్పాలి..తమ అభిమాన హీరోని వెండి తెరపై చూసి రెండేళ్లు అవుతుంది. దీంతో ఆయన ఫాన్స్ అంతా...పవన్ కొత్త చిత్రాల అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. కాగా తాజాగా దీనిపై స్పష్టత ఇచ్చారు.

పవన్ ఫ్యాన్స్‌కి ఇది పండగే..!
Jyothi Gadda
|

Updated on: Mar 01, 2020 | 12:29 PM

Share

నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్రాన్స్‌కి ఇది నిజంగా పండగలాంటి వార్త అనే చెప్పాలి..తమ అభిమాన హీరోని వెండి తెరపై చూసి రెండేళ్లు అవుతుంది. దీంతో ఆయన ఫాన్స్ అంతా…పవన్ కొత్త చిత్రాల అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే పింక్ రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్ర షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. దీంతో పింక్‌రిమేక్ లెటేస్ట్ అప్‌డేట్స్‌పై ఆశగా ఉన్నారు ఫాన్స్. ముఖ్యంగా ఈ చిత్రంలోని ఫస్ట్ లుక్ కోసం అతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా దీనిపై స్పష్టత ఇచ్చారు. త్వరలో పవన్ పింక్ రీమేక్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో పింక్ చిత్రాన్నిరీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాని మేలో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే మార్చి నుండి ఈ చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టాల‌ని ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్ర‌మంలోనే పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న మూవీ ఫ‌స్ట్ లుక్ మార్చి 2న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. వ‌కీల్ సాబ్ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో ప్ర‌చారం జ‌రుపుకుంటున్న ఈ చిత్రంలో అంజ‌లి, నివేదా థామ‌స్‌, అన‌న్య ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ప్రకాష్ రాజ్ ఓ కీలక రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత బోనీ క‌పూర్ ఈ చిత్రానికి స‌హా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.