మహా కుంభ్ మేళాలో ఫేక్ కోవిద్ టెస్టింగ్ ల్యాబ్…..భారీ ఫ్రాడ్.. ..దర్యాఫ్తునకై ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఆదేశం

హరిద్వార్ లో గత ఏప్రిల్ 1 నుంచి 30 వరకు జరిగిన మహా కుంభ్ మేళా సందర్భంగా ఓ ఫేక్ కోవిద్ టెస్టింగ్ ల్యాబ్ నిర్వాకం బయట పడింది. ఆ కుంభ్ మేళాకు సుమారు 70 లక్షలమంది భక్తులు, యాత్రికులు హాజరై ఉంటారని అంచనా.

మహా కుంభ్ మేళాలో ఫేక్ కోవిద్ టెస్టింగ్ ల్యాబ్.....భారీ ఫ్రాడ్.. ..దర్యాఫ్తునకై ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఆదేశం
Covid Test Lab During Kumbh Mela
Follow us

| Edited By: Phani CH

Updated on: Jun 13, 2021 | 10:53 PM

హరిద్వార్ లో గత ఏప్రిల్ 1 నుంచి 30 వరకు జరిగిన మహా కుంభ్ మేళా సందర్భంగా ఓ ఫేక్ కోవిద్ టెస్టింగ్ ల్యాబ్ నిర్వాకం బయట పడింది. ఆ కుంభ్ మేళాకు సుమారు 70 లక్షలమంది భక్తులు, యాత్రికులు హాజరై ఉంటారని అంచనా. ఆ సందర్బంగా కోవిద్ వ్యాప్తి చెందకుండా చూసేందుకు హరిద్వార్ జిల్లా అధికారులు 13 ప్రైవేట్ టెస్ట్ ల్యాబ్ లను ఏర్పాటు చేయగా..మేళా నిర్వాహకులు మరో 9 ల్యాబ్ లను కూడా నిర్వహించారు.అయితే వీటిని అద్దె ప్రాతిపదికపై ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ల్యాబ్ కు వచ్చే ప్రతి వ్యక్తి..వివరాలు నమోదు చేసుకోవాలని ఆదేశించారు. అయితే హర్యానాకు చెందిన ఓ ల్యాబ్ మాత్రం అధికారులను మోసగించినట్టు వెల్లడైంది. తాము కోవిద్ టెస్టులను చేసినట్టు కేవలం కాగితాలపైనే వీరు చూపారట. అంటే ఎంతమంది భక్తులకు నిజంగా టెస్టులు నిర్వహించిందీ తదితర వివరాలు లేకుండానే ఈ పేపర్లను సమర్పించారని తెలిసింది. ఈ బాగోతంలో సొమ్ములు కూడా నొక్కేసి ఉండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నారు. తాజాగా ఇది వెలుగులోకి రావడంతో దీనిపై ఇన్వెస్టిగేట్ చేయాలనీ హరిద్వార్ జిల్లా అధికారులను ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశించింది.

ఈ ఫేక్ టెస్టింగ్ ల్యాబ్ వ్యవహారంలో స్థానిక వ్యక్తులకు కూడా ప్రమేయం ఉందా అని ఆరా తీస్తున్నారు. పైగా ఈ ల్యాబ్ లో పరీక్షలు చేయించుకున్నవారి వివరాలు కూడా అస్పష్టంగా ఉన్నట్టు తెలిసింది. మొత్తం ఈ వ్యవహారంపై 15 రోజుల్లోగా దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఉత్తరాఖండ్ సర్కార్ ఆదేశించింది. ఇదంతా నిజమేనని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

మరిన్ని ఇక్కడ చూడండి: బాలయ్య కోసం అదిరిపోయే కథను సిద్ధం చేసిన అనిల్ రావిపూడి.. సినిమా పట్టాలెక్కేది ఎప్పుడంటే..

Prabhas : స్పీడ్ పెంచాలని చూస్తున్న పాన్ ఇండియా స్టార్.. బ్యాక్ టు బ్యాక్ సినిమా షూటింగ్స్ తో..

Latest Articles