AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

360 మంది భారత ఖైదీలను విడుదల చేయనున్న పాక్‌

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న భారత్‌కు చెందిన 360 మంది ఖైదీలను విడుదల చేయనున్నట్లు పాక్‌ అధికారులు శుక్రవారం ప్రకటించారు. నాలుగు విడతల్లో వీరందరినీ విడుదల చేయనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో 100మందిని అప్పగించనున్నారు. ఆదివారం (ఏప్రిల్‌ 7) జైలు నుంచి విడుదల చేసి సోమవారానికి వాఘా సరిహద్దు వద్దకు తీసుకొచ్చి భారత్‌కు అప్పగించనున్నట్లు వెల్లడించారు. రెండో విడతలో ఏప్రిల్‌ 15న 100 మందిని, మూడో విడతలో ఏప్రిల్‌ 22న 100 మందిని, నాలుగో […]

360 మంది భారత ఖైదీలను విడుదల చేయనున్న పాక్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 06, 2019 | 1:49 PM

Share

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న భారత్‌కు చెందిన 360 మంది ఖైదీలను విడుదల చేయనున్నట్లు పాక్‌ అధికారులు శుక్రవారం ప్రకటించారు. నాలుగు విడతల్లో వీరందరినీ విడుదల చేయనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో 100మందిని అప్పగించనున్నారు. ఆదివారం (ఏప్రిల్‌ 7) జైలు నుంచి విడుదల చేసి సోమవారానికి వాఘా సరిహద్దు వద్దకు తీసుకొచ్చి భారత్‌కు అప్పగించనున్నట్లు వెల్లడించారు. రెండో విడతలో ఏప్రిల్‌ 15న 100 మందిని, మూడో విడతలో ఏప్రిల్‌ 22న 100 మందిని, నాలుగో విడతలో ఏప్రిల్‌ 29న మిగిలిన 60 మందిని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. 2010 సెప్టెంబర్‌లోనూ ఇదే విధంగా 442 మంది భారత ఖైదీలను పాకిస్థాన్ విడిచిపెట్టింది. అయితే ఈ ఖైదీల్లో 355 మంది మత్స్యకారులు కాగా అయిదుగురు ఇతరులున్నారు. తాము చేపడుతున్న ఈ సుహృద్భావపూరిత చర్య నేపథ్యంలో భారత్‌ కూడా అదేవిధంగా ప్రతిస్పందిస్తుందంటూ.. పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి మహ్మద్ ఫైజల్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం