AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీ వ్యాఖ్యలపై ఒవైసీ ఫైర్!

ముస్లింలను రాజకీయాల కోసం భ్రమల్లోకి నెట్టారని, వారిలో కృత్రిమ భయాన్ని సృష్టించారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. శుక్రవారం తనను బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్న అనంతరం… పార్లమెంటు సెంట్రల్‌ హాలులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ముస్లింలు భయపడుతున్నారని మోదీ అంటున్నారు. మరి గోవు పేరుతో హత్యలు చేయడాన్ని మోదీ ఎందుకు నివారించడం లేదు? మూక దాడులకు ఎందుకు ముకుతాడు […]

మోదీ వ్యాఖ్యలపై ఒవైసీ ఫైర్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 26, 2019 | 7:52 PM

Share

ముస్లింలను రాజకీయాల కోసం భ్రమల్లోకి నెట్టారని, వారిలో కృత్రిమ భయాన్ని సృష్టించారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. శుక్రవారం తనను బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్న అనంతరం… పార్లమెంటు సెంట్రల్‌ హాలులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

‘‘ముస్లింలు భయపడుతున్నారని మోదీ అంటున్నారు. మరి గోవు పేరుతో హత్యలు చేయడాన్ని మోదీ ఎందుకు నివారించడం లేదు? మూక దాడులకు ఎందుకు ముకుతాడు వేయడం లేదు? ముస్లింలను కొడుతూ వీడియోలు తీసి వంచనకు గురి చేస్తున్నవారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ముస్లింలపై మోదీ ప్రేమ చూపిస్తున్నారు. మరి బీజేపీ గెలిచిన 300 ఎంపీల్లో ముస్లింలు ఎంత మంది ఉన్నారో చెప్పండి? మోదీ విధానం ఏంటో ఈ ఐదేళ్ల పాలన చూసి అర్థం చేసుకోవచ్చు’’ అని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు.