ఎగవేతదారుల రుణాలను మాఫీ చేసిన ఆర్బీఐ..వారు ఎవరో తెలుసా
ఎప్పటిలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్దల రుణాలను మాఫీ చేసింది. సామాన్యుడి ముక్కు పిండి మరీ వసూలు చేసే బ్యాంకులు బడాబాబుల ముందు మరోసారి చతికిలబడ్డాయి. ఇటీవల ఎగవేతదారులకు చెందిన వేలాది కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తూ ఆర్బిఐ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఎగవేత రుణాలను 68,607 కోట్ల రూపాయలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఆర్బిఐ. ఈ జాబితాలో ట్రాన్స్ట్రాయ్, దక్కన్ క్రానికల్ వంటి సంస్థలు ఉన్నాయి. ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి […]

ఎప్పటిలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్దల రుణాలను మాఫీ చేసింది. సామాన్యుడి ముక్కు పిండి మరీ వసూలు చేసే బ్యాంకులు బడాబాబుల ముందు మరోసారి చతికిలబడ్డాయి. ఇటీవల ఎగవేతదారులకు చెందిన వేలాది కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తూ ఆర్బిఐ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఎగవేత రుణాలను 68,607 కోట్ల రూపాయలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఆర్బిఐ. ఈ జాబితాలో ట్రాన్స్ట్రాయ్, దక్కన్ క్రానికల్ వంటి సంస్థలు ఉన్నాయి. ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి చెందిన 1790 కోట్ల రుణాలను రద్దు చేసింది. దక్కన్ క్రానికల్ రుణం 1,915 కోట్ల రూపాయలను రద్దు చేసింది ఆర్బిఐ.
గతంలో బ్యాంకులను మోసం చేసిందని ట్రాన్స్ట్రాయ్పై సీబీఐ కేసు పెట్టింది. రుణాల రద్దు అంశమై ఆర్టిఐ యాక్ట్ ద్వారా వివరాలు సేకరించారు సామాజిక కార్యకర్త సాకేత్ గోఖలే. ఎగవేతదారుల రుణాలను రద్దు చేయడాన్ని తప్పుపట్టింది ప్రతిపక్ష కాంగ్రెస్. ఆర్బిఐ రుణాలను రద్దు చేసిన వారంతా బీజేపీ మిత్రులేనని ఆరోపించింది. రుణాల వసూలులో విఫలమయ్యారని విమర్శించారు రాహుల్గాంధీ. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి పారిపోయిన విజయ్ మాల్యా, డైమండ్స్ టైకూన్ మెహుల్ ఛోక్సీ రుణాలను కూడా మాఫీ చేసింది ఆర్బిఐ. రుణ మాఫీ చేసిన కంపెనీల్లో 5,492 కోట్ల రూపాయలతో గీతాంజలి జెమ్స్ అగ్రస్థానంలో ఉంది. ఆర్ఇఐ ఆగ్రో 4,314 కోట్ల రూపాయలు, విన్సమ్ డైమండ్స్ అండ్ జువెల్లరీ 4,076 కోట్ల రూపాయలు మాఫీ అయ్యాయి. బాబా రాందేవ్ అండ్ బాలకృష్ణ గ్రూప్ కూడా ఈ జాబితాలో ఉంది.
