AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సౌండ్ పొల్యూషన్ నిబంధనలు అతిక్రమిస్తే.. రూ.లక్ష జరిమానా..!

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతిపాదించిన శబ్ద కాలుష్య నిబంధనలను ఉల్లంఘిస్తే లక్ష రూపాయల వరకు జరిమానా విధించవచ్చని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) పేర్కొంది. ఢిల్లీలో శబ్ద కాలుష్య నియమాలను

సౌండ్ పొల్యూషన్ నిబంధనలు అతిక్రమిస్తే.. రూ.లక్ష జరిమానా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 14, 2020 | 9:50 AM

Share

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతిపాదించిన శబ్ద కాలుష్య నిబంధనలను ఉల్లంఘిస్తే లక్ష రూపాయల వరకు జరిమానా విధించవచ్చని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) పేర్కొంది. ఢిల్లీలో శబ్ద కాలుష్య నియమాలను పాటించేలా చూసేందుకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్పీ గార్గ్ నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఛైర్ పర్సన్ ఆదర్శ్ కుమార్ గోయెల్ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆదేశించారు. శబ్ద కాలుష్య ఉల్లంఘనలకు జాతీయ కాలుష్య నియంత్రణ మండలి ప్రతిపాదించిన జరిమానాలను దేశవ్యాప్తంగా అమలు చేయడానికి చట్టబద్దమైన ఉత్తర్వులను జారీ చేయాలని ఎన్జీటీ కోరింది.

సౌండ్ పొల్యూషన్ నిబంధనలను ఉల్లంఘిస్తే లౌడ్ స్పీకర్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ను స్వాధీనం చేసుకోవడంతోపాటు రూ.10వేలు జరిమానా విధించాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతిపాదించింది. 1000 కేవీఏ కంటే ఎక్కువ సామర్థ్యం కల డీజిల్ జనరేటర్ల నుంచి వచ్చే శబ్ద కాలుష్యానికి లక్ష రూపాయల వరకు జరిమానా విధించాలని నిర్ణయించింది. నిర్మాణ ప్రదేశాల్లో అనుమతించిన స్థాయికి మించిన శబ్దం చేస్తే రూ.50వేలు జరిమానా విధించడంతోపాటు పరికరాలను స్వాధీనం చేసుకునేందుకు ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నివాస ప్రాంతాల్లో పగలు 55 డెసిబెల్స్, రాత్రివేళలో 45 డెసిబెల్స్ శబ్దం స్థాయిని అనుమతించనున్నారు.

Also Read: అమరావతి రైతులకు అన్యాయం జరగదు..!