AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవ దంపతుల ప్రాణాల మీదికి తెచ్చిన చికెన్ వంట

చికెన్ వంట కొత్త జంట ప్రాణాల మీదికి తెచ్చింది. ఇంట్లో చికెన్ వంట చేయడంతో నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య మృతి చెందగా, భర్త కొనఉపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.

నవ దంపతుల ప్రాణాల మీదికి తెచ్చిన చికెన్ వంట
Balaraju Goud
|

Updated on: Jun 24, 2020 | 7:48 PM

Share

చికెన్ వంట కొత్త జంట ప్రాణాల మీదికి తెచ్చింది. ఇంట్లో చికెన్ వంట చేయడంతో నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య మృతి చెందగా, భర్త కొనఉపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.

అస్సాంలోని లఖింపూర్‌కు చెందిన గురు దయాళ్‌(22), రేష్మా(19)లు జూన్‌ 19న వివాహం చేసుకున్నారు. కోటి ఆశలతో అత్తారింటికి కొత్త కాపురానికి వచ్చింది రేష్మా. జూన్ 22న చికెన్‌ తీసుకువచ్చి దయాళ్.. తల్లిని వండమని ఇచ్చాడు. అయితే రేష్మా విజిటేరియన్ కావడంతో ఇంట్లో చికెన్‌ వండటానికి వీలు లేదని తేల్చి చెప్పింది. అవసరమైతే బయట వెళ్లి వండుకొమ్మని భర్తకు చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన దయాళ్.. ఇంట్లోనే వండి తీరాలని పట్టుబట్టాడు. అయితే, ఇదే విషయంపై రేష్మా భర్తతో ఘర్షణకు దిగింది. ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. దీంతో రాత్రి మరోసారి గొడవపడి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది గమనించిన గురుదయాళ్‌ తండ్రి శివనాథ్‌ ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ రేష్మా మృతి చెందగా.. గురుదయాళ్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీనిపై స్పందించిన ఇసానగర్‌ పోలీసులు భార్యభర్తల ఆత్మహత్యకు చికెన్ వంట కారణమని తేల్చారు. కాగా ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదన్న పోలీసులు.. గురుదయాళ్ కోలుకున్నాక కేసు రిజిష్టర్ చేస్తామన్నారు.