లక్షల బేరం.. రాజ్ తరుణ్ కేసులో కొత్త నిజం..

హీరో రాజ్ తరుణ్ కారు ప్రమాదం కేసు మరోసారి సంచలనంగా మారింది. కారు యాక్సిడెంట్ కేసును వీడియో తీసిన కార్తిక్ అనే వ్యక్తి ఆ వీడియోలను బయటపెట్టాడు. మూడు రోజుల క్రితం నార్సింగ్ అల్కాపూర్ టౌన్‌షిప్‌లో రాజ్ తరుణ్ కారు గోడను ఢీ కొట్టింది. ఆ తర్వాత తరుణ్ కారు దిగి పరుగులు పెట్టాడు. ఆ సమయంలో కార్తిక్ రాజ్ తరుణ్‌ను వెంబడించి పట్టుకున్నాడు. కాసేపు ఇద్దరి మధ్య వాదనలు జరిగాయి. ఆ తర్వాత రాజ్ తరుణ్ […]

లక్షల బేరం.. రాజ్ తరుణ్ కేసులో కొత్త నిజం..
Follow us

| Edited By:

Updated on: Aug 22, 2019 | 4:54 PM

హీరో రాజ్ తరుణ్ కారు ప్రమాదం కేసు మరోసారి సంచలనంగా మారింది. కారు యాక్సిడెంట్ కేసును వీడియో తీసిన కార్తిక్ అనే వ్యక్తి ఆ వీడియోలను బయటపెట్టాడు. మూడు రోజుల క్రితం నార్సింగ్ అల్కాపూర్ టౌన్‌షిప్‌లో రాజ్ తరుణ్ కారు గోడను ఢీ కొట్టింది. ఆ తర్వాత తరుణ్ కారు దిగి పరుగులు పెట్టాడు. ఆ సమయంలో కార్తిక్ రాజ్ తరుణ్‌ను వెంబడించి పట్టుకున్నాడు. కాసేపు ఇద్దరి మధ్య వాదనలు జరిగాయి. ఆ తర్వాత రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర కార్తిక్‌కు ఫోన్ చేసి బెదిరించారు. ఆడియో టేపును ఇస్తే రూ. 5 లక్షలు ఇస్తామని కూడా ఆఫర్ చేశారు. అతడు అంగీకరించకపోవడంతో బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో కార్తిక్ ఆ వీడియోలను బయటపెట్టాడు.