AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New COVID strain : ప్రపంచ దేశాలను వణికిస్తోన్న స్ట్రెయిన్‌, బ్రిటన్‌లో విజృంభిస్తోన్న కొత్త రకం వైరస్, తెలంగాణలో ఇద్దరికి లక్షణాలు

అప్పుడు చైనా.. ఇప్పుడు బ్రిటన్. స్ట్రెయిన్‌గా రూపాంతరం చెందిన కరోనా ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. బ్రిటన్‌లో కొత్త ర..

New COVID strain : ప్రపంచ దేశాలను వణికిస్తోన్న స్ట్రెయిన్‌, బ్రిటన్‌లో విజృంభిస్తోన్న కొత్త రకం వైరస్, తెలంగాణలో ఇద్దరికి లక్షణాలు
Venkata Narayana
|

Updated on: Dec 23, 2020 | 10:07 AM

Share

అప్పుడు చైనా.. ఇప్పుడు బ్రిటన్. స్ట్రెయిన్‌గా రూపాంతరం చెందిన కరోనా ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. బ్రిటన్‌లో కొత్త రకం వైరస్ వేగంగా విజృంభిస్తోంది. రోజు వారిగా వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య 64.7 శాతానికి చేరింది. బ్రిటన్‌ నుంచి విమానాల రాకపోకల విషయంలో ప్రపంచ దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఆ దేశంతో ఉన్న సరిహద్దులను ఫ్రాన్స్‌ మూసివేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ అత్యవసరంగా సమావేశం అవుతున్న WHO..కొత్త రకం వైరస్‌పై చర్చించనుంది. దాన్ని తట్టుకోవడం ఎలా? దాని నుంచి ప్రపంచ దేశాలకు ఉన్న ముప్పేంటి? ఏ విధంగా అప్రమత్తం చేయాలని దానిపై సభ్యులు చర్చించనున్నారు.

కొత్త వైరస్‌ నేపథ్యంలో అలజడి మొదలైంది. బ్రిటన్‌ నుంచి వచ్చిన వారిలో 25 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. జన్యుమార్పిడి చెందిన వైరస్‌ కావొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణకు వచ్చిన ఇద్దరిలోనూ కరోనా లక్షణాలు బయటపడ్డాయి. కొత్త వైరస్‌ నిర్ధారణ కోసం నమూనాలను పుణె పంపారు అధికారులు. గత రెండు వారాల్లో బ్రిటన్‌ నుంచి 1500 మంది వచ్చినట్లు తెలుస్తోంది. బ్రిటన్‌ నుంచి వచ్చిన వారికి పరీక్షలు చేయనుంది ప్రభుత్వం. స్ట్రెయిన్ మహమ్మారి కొత్తగా జడలు విప్పుతోన్న వేళ, కేరళలో కొత్తగా 6.049మందికి కరోనా సోకగా, రాష్ట్రంలో 27 మరణాలు సంభవించాయి. దీంతో కేరళ సర్కారు అప్రమత్తమైంది. తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.