భారత్ లో 2 లక్షలు దాటిన కరోనా కేసులు..!
భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. దేశంలో ఇప్పటివరకు 96,563 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. దేశంలో ఇప్పటివరకు 96,563 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 5,632 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 99,135 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు గత మూడు రోజులుగా భారత్లో కరోనా కేసుల సంఖ్య 8 వేలకు పైగా నమోదవుతున్నాయి. అయితే కేవలం 15 రోజుల్లోనే దేశంలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తుండగా.. రికవరీ రేటు 48.07 శాతం ఉండటం కాస్త ఊరట కలిగిస్తోంది. మరోవైపు దేశంలో కరోనా మరణాల రేటు 2.82 శాతంగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడులలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 70 వేల దాటింది.