Breaking : రేణిగుంటలో వైసీపీ మైనార్టీ నాయకుడిపై హత్యాయత్నం
తిరుపతి రేణిగుంటలో వైసీపీ మైనార్టీ నాయకుడు, మాజీ ఎంపిటిసి అమానుల్లాపై హత్యాయత్నం జరిగింది. పక్కా స్కెచ్ వేసి..బుగ్గ వీధిలో కాపు కాచి దాడికి పాల్పడ్డారు ప్రత్యర్థులు.
తిరుపతి రేణిగుంటలో వైసీపీ మైనార్టీ నాయకుడు, మాజీ ఎంపిటిసి అమానుల్లాపై హత్యాయత్నం జరిగింది. పక్కా స్కెచ్ వేసి..బుగ్గ వీధిలో కాపు కాచి దాడికి పాల్పడ్డారు ప్రత్యర్థులు. దాడిలో అమానుల్లాకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. పాత కక్ష్యలే దాడి కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు…దాడికి సంబంధించి వివరాలు ఆరా తీస్తున్నారు. కాగా ఆకస్మాత్తుగా జరిగిన ఈ ఘర్షణతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
ఇది కూడా చదవండి: కుమార్తెలతో కాడి మోయిస్తూ రైతు వ్యవసాయం..చలించిపోయిన సోనూసూద్..