AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! పైగా ఆ పశువులకు మెషీన్‌ గన్స్‌తో కాపలా.. ఎక్కడంటే..

ఆవు పేడను పోగు చేసి కాలుస్తుంటారు. దాంతో వచ్చే బూడిదను వేడి నుండి రక్షించడానికి సన్‌స్క్రీన్‌గా ఉపయోగిస్తారు. వారి ఆహారంలో ప్రత్యేకంగా తమ ఆవుల నుండి సేకరించిన పాల ఉత్పత్తులు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆవులు ఎనిమిది అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఒక్కొక్కటి రూ.41,000 విలువ పలుకుతున్నాయి. ఈ తెగకు చెందిన గోరక్షకులు ఈ ఆవులను తమ అత్యంత విలువైన సంపదగా భావిస్తారు.

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! పైగా ఆ పశువులకు మెషీన్‌ గన్స్‌తో కాపలా.. ఎక్కడంటే..
African Tribe
Jyothi Gadda
|

Updated on: Mar 29, 2024 | 3:55 PM

Share

ప్రపంచంలో ఆవులను తమ దైవంగా భావించి ప్రతిరోజూ పూజించే ఏకైక దేశం భారతదేశం. కానీ, ఇది తప్పు..ఎందుకంటే.. గోవులను పూజించే మరో దేశం కూడా ఉంది.. అక్కడి ప్రజలు ఆవు మూత్రంతో స్నానం చేస్తారు. పేడను స్నానానికి, సన్‌స్క్రీన్‌గా ఉపయోగిస్తారు. అవును వినడానికి కాస్త ఇబ్బందిగా, ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది నిజమే.. తూర్పు మధ్య ఆఫ్రికాలోని దక్షిణ సూడాన్‌లో ముండారి తెగ ప్రజలు ఇలాంటి వింత పద్ధతులను అనుసరిస్తున్నారు. వారి జీవనశైలి వారి విలువైన పశువుల సంరక్షణ..అందుకోసం మెషిన్ గన్లతో ఈ ఆవులను రక్షించుకుంటుంటారు.

అంకోలే వటుషి జాతికి చెందిన ఆవులను ‘రాజుల పశువులు’ అని కూడా అంటారు. ఈ ఆవులు ఎనిమిది అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఒక్కొక్కటి రూ.41,000 విలువ పలుకుతున్నాయి. ఈ తెగకు చెందిన గోరక్షకులు ఈ ఆవులను తమ అత్యంత విలువైన సంపదగా భావిస్తారు. ముండార్లకు ఆవు కేవలం జంతువు మాత్రమే కాదు వారి ప్రతిష్టకు సంబంధించిన అంశం. ఆవులు పడుకున్నప్పుడు, దొంగతనం లేదా హత్యలు జరగకుండా గిరిజనులు మెషిన్ గన్‌లతో వాటికి కాపలాగా ఉంటారు.

ముండారి తెగ వారి ఆహారంలో ప్రత్యేకంగా తమ ఆవుల నుండి సేకరించిన పాల ఉత్పత్తులు ఎక్కువగా ఉంటాయి. అంకోలే వటుషి పశువుల ఇతర శరీర ద్రవాలను కూడా ఈ పశువుల కాపరులు స్నానానికి, పళ్ళు తోముకోవడానికి ఉపయోగిస్తారు. ఆవు మూత్రం చేస్తుండగానే ముండారీ పురుషులు దాని కింద కూర్చుంటారు. అలా ఆవు మూత్రంలోని అమ్మోనియా కారణంగా వారి జుట్టు రంగు నారింజ రంగులోకి మారుతుంది.

ఇవి కూడా చదవండి

ముండారి తెగ ఆవు పేడను పోగు చేసి కాలుస్తుంటారు. దాంతో వచ్చే బూడిదను 115 డిగ్రీల వేడి నుండి రక్షించడానికి సన్‌స్క్రీన్‌గా ఉపయోగిస్తారు. ఈ పశువుల ధర ఎక్కువగా ఉండటంతో ఈ అంకోలే వటుషి పశువులను మాంసం కోసం చంపేసే పనులు చేయరు. కానీ, ఈ గిరిజన ప్రజలు వారి బంధువులు మిత్రుల మధ్య బహుమతులు, కట్నంగా ఇచ్చిపుచ్చుకుంటుంటారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు