AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రాయ్ న్యూ రూల్స్.. ఇకపై మూడు రోజుల్లోనే ఎంఎన్‌పీ!

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అమలులోకి తెచ్చిన సరికొత్త నిర్ణయంతో మొబైల్ నెంబర్ పోర్టిబిలిటీ మరింత ఈజీ కానుంది. ఇప్పటివరకు వారం రోజులు పడుతున్న ఈ ప్రక్రియ ఇకపై మూడు రోజుల్లోనే పూర్తవుతుంది. ఇక ఈ నూతన నిబంధనలు ఇవాళ్టి నుంచి వర్తిస్తాయి  వినియోగదారుడు తమ మొబైల్ నెంబర్‌ను పోర్ట్ చేసుకోవడానికి అర్హుడో కాదో అనేది ట్రాయ్ డిసైడ్ చేయనుంది. ఇకపోతే పోస్ట్ పెయిడ్ కస్టమర్లు తమ బిల్లులు చెల్లించిన తర్వాతే నెంబర్‌ను పోర్టిబిలిటీ […]

ట్రాయ్ న్యూ రూల్స్.. ఇకపై మూడు రోజుల్లోనే ఎంఎన్‌పీ!
Ravi Kiran
|

Updated on: Dec 16, 2019 | 6:09 AM

Share

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అమలులోకి తెచ్చిన సరికొత్త నిర్ణయంతో మొబైల్ నెంబర్ పోర్టిబిలిటీ మరింత ఈజీ కానుంది. ఇప్పటివరకు వారం రోజులు పడుతున్న ఈ ప్రక్రియ ఇకపై మూడు రోజుల్లోనే పూర్తవుతుంది. ఇక ఈ నూతన నిబంధనలు ఇవాళ్టి నుంచి వర్తిస్తాయి  వినియోగదారుడు తమ మొబైల్ నెంబర్‌ను పోర్ట్ చేసుకోవడానికి అర్హుడో కాదో అనేది ట్రాయ్ డిసైడ్ చేయనుంది.

ఇకపోతే పోస్ట్ పెయిడ్ కస్టమర్లు తమ బిల్లులు చెల్లించిన తర్వాతే నెంబర్‌ను పోర్టిబిలిటీ చేసుకోవడానికి వీలు పడుతుంది. అంతేకాకుండా ఒకసారి బ్యాన్ చేసిన నెంబర్‌కు ఎంఎన్‌పీ కుదరదని ట్రాయ్ స్పష్టం చేసింది. అంతేకాకుండా మీ మొబైల్ నెంబర్ వేరొకరి పేరు మీదకు మార్చడానికి ఇప్పటికే అభ్యర్థించినట్లయితే మీ నెంబర్ పోర్టబిలిటీకి అర్హత పొందదు. అటు న్యాయస్థానం చేత నిషేధించబడిన మొబైల్ నంబర్స్‌కు కూడా పోర్టింగ్ సాధ్యపడదు.

ఇక ప్రతీ పోర్టిబిలిటీకి రూ.6.46లను ఫీజుగా తీసుకోనున్న ట్రాయ్.. యూపీసీ వ్యాలిడిటీ ముగిసేవరకు యూజర్ల పోర్టింగ్ దరఖాస్తును తిరస్కరించదు. కాగా, కార్పొరేట్ సర్కిల్స్‌లో పని చేస్తున్న వారు మొబైల్ నెంబర్ పోర్టింగ్‌కు అఫీషియల్‌గా లేఖను ఇవ్వాల్సి వస్తుంది. వారికి మూడు లేదా ఐదు రోజుల్లో ఈ ప్రక్రియ ముగుస్తుందని ట్రాయ్ స్పష్టం చేసింది.