స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలు సమర్పించారు : కేఆర్ రమేష్ కుమార్
కన్నడ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యేలు సరైన ఫార్మాట్లో తనకు రాజీనామాలు సమర్పించారని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేశ్కుమార్ వెల్లడించారు. కాంగ్రెస్, జేడీ(ఎస్) కు చెందిన రెబల్ ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రం స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు సమర్పించారు. అనంతరం స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాజీనామాలపై ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నాననే వార్తలు తనను బాధించాయని స్పీకర్ అన్నారు. గవర్నర్ నాకు ఆరో తేదీన సమాచారం ఇచ్చారని తెలిపారు. […]
కన్నడ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యేలు సరైన ఫార్మాట్లో తనకు రాజీనామాలు సమర్పించారని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేశ్కుమార్ వెల్లడించారు. కాంగ్రెస్, జేడీ(ఎస్) కు చెందిన రెబల్ ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రం స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు సమర్పించారు. అనంతరం స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాజీనామాలపై ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నాననే వార్తలు తనను బాధించాయని స్పీకర్ అన్నారు.
గవర్నర్ నాకు ఆరో తేదీన సమాచారం ఇచ్చారని తెలిపారు. జులై 6న మధ్యాహ్నం 1.30 గంటల వరకు నా ఛాంబర్లోనే ఉన్నానని.. ఎమ్మెల్యేలు నేను వెళ్లిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఆఫీసుకు వచ్చారన్నారు. అంతకుముందు నన్ను కలుస్తానని ఏ ఎమ్మెల్యే కూడా అపాయింట్ మెంట్ తీసుకోలేదని.. నేను ఎమ్మెల్యేలు వస్తున్నారని తెలిసి ఆఫీసు నుంచి వెళ్లిపోయాననే మాట అవాస్తమని స్పీకర్ పేర్కొన్నారు.