మంత్రి మల్లారెడ్డి మానవత్వం

తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి మానవత్వం చాటుకున్నారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలోని గౌరీ ఆశ్రమంలో ఒక అనాధ అమ్మాయి వివాహాన్ని మల్లారెడ్డి దంపతులు ఘనంగా జరిపించారు. ఆదివారం నాడు ఆశ్రమంలోని పుష్పను విజయవాడకు చెందిన కిషోర్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఈ వేడుకకు అన్ని తామై మంత్రి దంపతులు ఘనంగా పెళ్లి వేడుక జరిపారు. అమ్మాయి తరపున మంత్రి మల్లా రెడ్డి దంపతులు తామే తల్లిదండ్రులై కన్యాదానం చేశారు. అమ్మాయి పేరున రూ. 2,35,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ […]

మంత్రి మల్లారెడ్డి మానవత్వం
Follow us

| Edited By:

Updated on: Jun 23, 2019 | 4:00 PM

తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి మానవత్వం చాటుకున్నారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలోని గౌరీ ఆశ్రమంలో ఒక అనాధ అమ్మాయి వివాహాన్ని మల్లారెడ్డి దంపతులు ఘనంగా జరిపించారు. ఆదివారం నాడు ఆశ్రమంలోని పుష్పను విజయవాడకు చెందిన కిషోర్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఈ వేడుకకు అన్ని తామై మంత్రి దంపతులు ఘనంగా పెళ్లి వేడుక జరిపారు. అమ్మాయి తరపున మంత్రి మల్లా రెడ్డి దంపతులు తామే తల్లిదండ్రులై కన్యాదానం చేశారు. అమ్మాయి పేరున రూ. 2,35,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి… రూ. 25,000 నగదు ఇచ్చారు. వివాహ ఖర్చులు మొదలుకుని అన్నీ తామే భరించారు. అనాధ అమ్మాయికి తల్లి తండ్రుల స్థానంలో మంత్రి దంపతులు దగ్గరుండి వివాహం జరిపించడాన్ని పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.