‘ఈచ్ వన్.. ప్లాంట్ వన్’ కు పిలుపునిచ్చిన మంత్రి కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ఆరో విడత కార్యక్రమాన్ని మంత్రి కేటీ రామారావు ఔటర్ రింగ్ రోడ్డు లోని దుండిగల్ ఎగ్జిట్ 5 వద్ద ప్రారంభించారు. మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) నర్సరీ సమీపంలో మొక్కలు నాటారు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ఆరో విడత కార్యక్రమాన్ని మంత్రి కేటీ రామారావు ఔటర్ రింగ్ రోడ్డు లోని దుండిగల్ ఎగ్జిట్ 5 వద్ద ప్రారంభించారు. మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) నర్సరీ సమీపంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హెచ్ఎండిఏ హరితహారం బ్రోచర్ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్.. ‘ఈచ్ వన్ ప్లాంట్ వన్’ అనే నినాదంతో ముందుకెళుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి, వాటిని సంరక్షించాలన్నారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహించే ఔటర్ రింగ్ వెంట ప్రతి పది కిలోమీటర్లకు ఒక ‘థీమ్’ ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పురపాలక శాఖ అధ్వర్యంలో మొత్తం 12.5 కోట్ల మొక్కలు నాటడమే తమ లక్ష్యమని అన్నారు. అంతరిస్తున్న ఆడవులను సంరక్షించుకోవాలంటే ఉద్యమస్ఫూర్తితో ముందుకెళ్లాలన్నారు.
