AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాంచీలో పండుగవేళ విషాదం… భూత వైద్యుడి మాటలు నమ్మి కొడుకు కోసం బిడ్డను చంపిన తండ్రి

దేశం మొత్తం దీపావళి సంబురాల్లో మునిగితే, మరోవైపు మూఢవిశ్వాసంతో కన్నబిడ్డను బలి ఇచ్చాడు ఓ కసాయి తండ్రి.

రాంచీలో పండుగవేళ విషాదం... భూత వైద్యుడి మాటలు నమ్మి కొడుకు కోసం బిడ్డను చంపిన తండ్రి
Balaraju Goud
|

Updated on: Nov 14, 2020 | 9:11 PM

Share

దేశం మొత్తం దీపావళి సంబురాల్లో మునిగితే, మరోవైపు మూఢవిశ్వాసంతో కన్నబిడ్డను బలి ఇచ్చాడు ఓ కసాయి తండ్రి.. ప్రపంచం మొత్తం అభివృద్ధివైపు పరుగులు తీస్తున్నా.. కొందరు మాత్రం తమను తాము చీకట్లోనే బంధించుకుంటున్నారు.జార్ఖండ్‌లోని చాలా ప్రాంతాలు ఇంకా మంత్ర-తంత్రాల వెంటే పరుగులు తీస్తున్నారు. తాజా ఓ విషాదకర ఘటన ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. కొడుకు పుట్టాలంటే కుమార్తెను బలివ్వాలన్న ఓ మంత్రగాడి మాయమాటలు నమ్మిన ఓ తండ్రి కన్న కూతురును పొట్టనపెట్టుకున్నాడు.

పోలీసుల కథనం ప్రకారం.. రాజధాని రాంచీలోని లోహర్డగ పెష్రార్ బ్లాక్‌కు చెందిన 26 ఏళ్ల సుమన్ నగాసియా రోజు కూలీ. అతడికి ఆరేళ్ల కుమార్తె ఉంది. ఇటీవల అతడు ఓ భూతవైద్యుడిని కలిసి తనకు మగ సంతానం కావాలంటూ వేడుకున్నాడు. అతడి వేదన విన్న భూతవైద్యుడు.. అబ్బాయి కావాలంటే ఉన్న అమ్మాయిని బలివ్వాల్సి ఉంటుందని ప్రేరేపించాడు. దీంతో అది నిజమేనని నమ్మిన సుమన్ మరో ఆలోచన లేకుండా కుమార్తె తల నరికి బలిచ్చాడు. ఈ ఘటన జరిగినప్పుడు బాలిక తల్లి ఆమె తల్లిగారింటికి వెళ్లింది. ఇదే అదునుగా ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.

ఈ దారుణానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సుమన్‌ను అరెస్ట్ చేసి, బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న భూతవైద్యుడు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

Follow Us