AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేక్ మై ట్రిప్ ఉద్యోగులపై వేటు..!

కరోనా కారణంగా కుదేలవుతున్న సంస్థలు. ఆర్థిక దిద్దుబాటు చర్యలు చేపడుతున్న కంపెనీలు. తాజగా ఉద్యోగుల్లో కోత విధించిన మేక్ మై ట్రిప్ సంస్థ.

మేక్ మై ట్రిప్ ఉద్యోగులపై వేటు..!
Balaraju Goud
|

Updated on: Jun 02, 2020 | 9:10 PM

Share

కరోనా వైరస్ ప్రభావంతో అన్నీ రంగాలు కుదేలవుతున్నాయి. ప్రాజెక్టులు లేక కొత్తవి రాకపోవడంతో కంపెనీలు తమ ఖర్చుల తగ్గించుకునే పనిలోపడ్డాయి. కొన్ని కంపెనీలు జీతాలు తగ్గిస్తుండగా.. మరికొన్ని సంస్థలు ఉద్యోగులను కుదిస్తున్నాయి. ఇప్పటివరకు చాలా కంపెనీలు ఉద్యోగులను తగ్గించగా.. తాజాగా అదేబాటలో మేక్ మై ట్రిప్ కూడా పయనిస్తున్నది. కరోనా వల్ల లాక్ డౌన్ విధించడంతో పర్యాటక రంగం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. రాకపోకలు సాగించేందుకు జనం అయిష్టత చూపుతున్నారు. రెండు నెలలుగా పరిస్థితిని గమనించామని సీఈవో రాజేశ్ లేఖలో పేర్కోన్నారు. వ్యాపార పునరుద్దరణకు మార్గం అన్వేషించామని.. కానీ వ్యాపార మార్గాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయని తెలిపారు. ఇప్పట్లో పర్యాటక రంగం కొలుకునే అవకాశం లేదని.. తమకు ఉద్యోగులను తగ్గించుకోవడం తప్ప మరో మార్గం కనిపించలేదని ఒక ప్రకటనలో వెల్లడించారు. తాము ఇప్పుడు తీసుకుంటున్న చర్య కంపెనీ భవిష్యత్ కోసం ఆలోచించి చేసిందని పేర్కొన్నారు.