కరోనాతో ఏఆర్ డీఎస్పీ శశిధర్ కన్నుమూత
తెలంగాణలో కరోనా వీరవిహారం చేస్తోంది. మరణాల సంఖ్య కూడా ప్రమాదకరంగా పెరుగుతోంది. ఈ విపత్కర సమయంలో ముందుండి పనిచేస్తోన్న కరోనా వారియర్స్ కూడా అధిక సంఖ్యలో ప్రాణాలు కొల్పోతున్నారు.
DSP Died With Corona : తెలంగాణలో కరోనా వీరవిహారం చేస్తోంది. మరణాల సంఖ్య కూడా ప్రమాదకరంగా పెరుగుతోంది. ఈ విపత్కర సమయంలో ముందుండి పనిచేస్తోన్న కరోనా వారియర్స్ కూడా అధిక సంఖ్యలో ప్రాణాలు కొల్పోతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏ.ఆర్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న శశిధర్ కరోనాతో ప్రాణాలు విడిచారు. గతంలో ఆయన పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. డీఎస్పీ శశిధర్ మృతిపట్ల జిల్లా పోలీస్ అధికారులు సంతాపం ప్రకటించారు
తెలంగాణలో అధికంగానే కరోనా వ్యాప్తి
వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం ఆదివారం రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో 1256 మందికి కొత్తగా కరోనా సోకినట్టు నిర్దారణ అయ్యింది. ఆదివారం సెలవు దినం కావడంతో..తక్కువ సంఖ్యలో టెస్టులు చెయ్యడం వల్ల..పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తక్కువగా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ 6,24,840 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 80,751 మందికి పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,528 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఆదివారం 10 మంది కరోనా కారణంగా చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 637కి చేరింది.
Aso Read : బంగాళాఖాతంలో అల్పపీడనం : తెలంగాణలో విస్తారంగా వర్షాలు