AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎటూ తేలని మధ్యప్రదేశ్ పొలిటికల్ క్రైసిస్.. రేపు మళ్ళీ సుప్రీం విచారణ

మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభం మరో రోజుకూడా కొనసాగనుంది. బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తగీ, కాంగ్రెస్ తరఫున అభిషేక్ మను సింఘ్వి తో బాటు మరో సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే కూడా చేసిన వాదనలు, ప్రతివాదనలతో సుప్రీంకోర్టులో బుధవారం విచారణ 'హీటెక్కింది'

ఎటూ తేలని మధ్యప్రదేశ్ పొలిటికల్ క్రైసిస్.. రేపు మళ్ళీ  సుప్రీం విచారణ
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 18, 2020 | 6:04 PM

Share

మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభం మరో రోజుకూడా కొనసాగనుంది. బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తగీ, కాంగ్రెస్ తరఫున అభిషేక్ మను సింఘ్వి తో బాటు మరో సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే కూడా చేసిన వాదనలు, ప్రతివాదనలతో సుప్రీంకోర్టులో బుధవారం విచారణ ‘హీటెక్కింది’. 22 మంది రెబెల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో ఓ వైపు మధ్యప్రదేశ్ లో సీఎం కమల్ నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడగా.. మరోవైపు అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ జరిగేలా చూడాలంటూ బీజేపీ  పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఈరోజంతా సుదీర్ఘ విచారణ జరిగింది. 19 మంది ఎమ్మెల్యేలు రాసినట్టు చెబుతున్న రాజీనామా లేఖలను ఒక్కరే రాశారని, ఇతర ఎమ్మెల్యేలు దానిపై సంతకాలు చేశారని, పైగా ఆరుగురు సభ్యుల తరఫున మరో ఇద్దరు రాజీనామా లేఖలను రూపొందించారని కాంగ్రెస్ తరఫున అభిషేక్ మను సింఘ్వి ఆరోపించారు. స్పీకర్ ను కాదని  అసలు అసెంబ్లీ వ్యవహారాల్లో గవర్నర్ అనుచిత జోక్యం చేసుకున్నారని ఆయన అన్నారు. అటు-ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేయడం, న్యాయబధ్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టడంకాదా అని మరో న్యాయవాది దుశ్యంత్ దవే దుయ్యబట్టారు. కాగా.. బీజేపీ తరఫున వాదించిన లాయర్ ముకుల్ రోహ్తగీ.. రాష్ట్రంలో అధికారంలో కొనసాగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. తాము ఎమ్మెల్యేలనెవరినీ కిడ్నాప్ చేయలేదని, వారే స్వచ్ఛందంగా భోపాల్ నుంచి బెంగుళూరు చేరుకున్నారని ఆయన అన్నారు. అటు-జస్టిస్ వై.వి.చంద్రచూడ్ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల బెంచ్ ఈ కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది.

Follow Us
టీ20ఐల్లో నంబర్ 1 ఓపెనర్ ఎవరు.. లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే?
టీ20ఐల్లో నంబర్ 1 ఓపెనర్ ఎవరు.. లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే?
తిరుమల శ్రీవారి భక్తులకు ఊరట.. లడ్డూ విషయంలో కొత్త రూల్స్..
తిరుమల శ్రీవారి భక్తులకు ఊరట.. లడ్డూ విషయంలో కొత్త రూల్స్..
ఒక్క సినిమాతోనే క్రేజ్.. చివరకు కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం..
ఒక్క సినిమాతోనే క్రేజ్.. చివరకు కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం..
అదే బ్యాడ్.! పైకి కనిపించేవి నోరూరించే స్వీట్లే.. తిన్నారనుకోండి
అదే బ్యాడ్.! పైకి కనిపించేవి నోరూరించే స్వీట్లే.. తిన్నారనుకోండి
ఫైనల్ వరకూ వీళ్లంతా బెంచ్‌ ఫిక్స్.. ప్లేయింగ్-11 నుంచి 4గురు ఔట్?
ఫైనల్ వరకూ వీళ్లంతా బెంచ్‌ ఫిక్స్.. ప్లేయింగ్-11 నుంచి 4గురు ఔట్?
మదనపల్లె బాలిక పోస్టుమార్టంలో వెలుగులోకి సంచలన నిజం
మదనపల్లె బాలిక పోస్టుమార్టంలో వెలుగులోకి సంచలన నిజం
ముస్లిం ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. గంటముందే ఇంటికెళ్లే ఛాన్స్!
ముస్లిం ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. గంటముందే ఇంటికెళ్లే ఛాన్స్!
ఈ వారం ఓటీటీల్లో రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లివే
ఈ వారం ఓటీటీల్లో రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లివే
పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. ఒకేసారి పెరిగిన అరటి పండ్ల ధరలు
పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. ఒకేసారి పెరిగిన అరటి పండ్ల ధరలు
బాలీవుడ్ నటి కన్నమూత.. క్యాన్సర్‌తో పోరాడి చివరకు.
బాలీవుడ్ నటి కన్నమూత.. క్యాన్సర్‌తో పోరాడి చివరకు.