గ్వాలియర్ లో ఘోర ప్రమాదం.. ఏడుగురు సజీవదహనం

మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. గ్వాలియర్‌ పట్టణంలో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో నలుగురు చిన్నారులతో సహా ఏడుగురు అగ్నికి అహుతయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రోషిణిఘర్‌ రోడ్డులోని ఓ పెయింట్‌ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెయింట్ కెమికల్స్ కి అంటుకొని మంటలు అన్నివైపులా విస్తరించాయి. పొరుగున ఉన్న ఇండ్లకు కూడా అగ్నికీలలు చుట్టుముట్టాయి. దీంతో నలుగురు చిన్నారులు సహా ఏడుగురు మంటలకు ఆహుతయ్యారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. మరో […]

గ్వాలియర్ లో ఘోర ప్రమాదం.. ఏడుగురు సజీవదహనం
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2020 | 7:57 PM

మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. గ్వాలియర్‌ పట్టణంలో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో నలుగురు చిన్నారులతో సహా ఏడుగురు అగ్నికి అహుతయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రోషిణిఘర్‌ రోడ్డులోని ఓ పెయింట్‌ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెయింట్ కెమికల్స్ కి అంటుకొని మంటలు అన్నివైపులా విస్తరించాయి. పొరుగున ఉన్న ఇండ్లకు కూడా అగ్నికీలలు చుట్టుముట్టాయి. దీంతో నలుగురు చిన్నారులు సహా ఏడుగురు మంటలకు ఆహుతయ్యారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. రెండు గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నికి ఆహుతైన మృతులంతా పెయింట్ దుకాణానికి చెందిన వారే కావడం విశేషం వీరంతా షాపులోనే నివాసం ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.