మధ్యప్రదేశ్ ఉపఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ
దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభం కాబోతోంది. ఈ నేపధ్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు, మధ్యప్రదేశ్ ఉపఎన్నికల ఫలితాలు ఆసక్తిరేపుతున్నాయి. రాష్ట్రంలోని 28 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 3న ఉపఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం 19 జిల్లాల్లో ఉన్న 28 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. కరోనా నేపథ్యంలో.. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద […]
దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభం కాబోతోంది. ఈ నేపధ్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు, మధ్యప్రదేశ్ ఉపఎన్నికల ఫలితాలు ఆసక్తిరేపుతున్నాయి. రాష్ట్రంలోని 28 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 3న ఉపఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం 19 జిల్లాల్లో ఉన్న 28 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. కరోనా నేపథ్యంలో.. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ప్రజలు గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈసీ సూచనల మేరకు.. కేవలం ఎన్నికల అభ్యర్థులు.. వారి పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు మాత్రమే కేంద్రాల వద్ద ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి అమలు చేస్తున్నారు.