AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శివరాత్రి స్పెషల్: సామర్లకోట భీమేశ్వరుడి రథానికి హైడ్రాలిక్ బ్రేక్స్ ఏర్పాటు!

మహా శివరాత్రి సంబరాలు మెదులు అయ్యాయి. గ్రామాలలో, పట్టణాలలో శివరాత్రి మహోత్సవం కోసం ఆలయాలు అందంగా ముస్తాబు అవుతున్నాయి. ఈ క్రమంలోనే కాకినాడ జిల్లా సామర్లకోట భీమేశ్వరుడి ఆలయం శివరాత్రి మహోత్సవాలకు సిద్ధమైంది. ఉత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Feb 13, 2026 | 2:29 PM

Share
మహా శివరాత్రి సంబరాలు మెదులు అయ్యాయి. గ్రామాలలో, పట్టణాలలో శివరాత్రి మహోత్సవం కోసం ఆలయాలు అందంగా ముస్తాబు అవుతున్నాయి. ఈ క్రమంలోనే కాకినాడ జిల్లా సామర్లకోట భీమేశ్వరుడి ఆలయం శివరాత్రి మహోత్సవాలకు సిద్ధమైంది. ఉత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ముఖ్యంగా  రథోత్సవం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోవడానికి రథానికి హైడ్రాలిక్ బ్రేక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

మహా శివరాత్రి సంబరాలు మెదులు అయ్యాయి. గ్రామాలలో, పట్టణాలలో శివరాత్రి మహోత్సవం కోసం ఆలయాలు అందంగా ముస్తాబు అవుతున్నాయి. ఈ క్రమంలోనే కాకినాడ జిల్లా సామర్లకోట భీమేశ్వరుడి ఆలయం శివరాత్రి మహోత్సవాలకు సిద్ధమైంది. ఉత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ముఖ్యంగా రథోత్సవం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోవడానికి రథానికి హైడ్రాలిక్ బ్రేక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

1 / 5
మహాశివరాత్రి పర్వదినాల్లో కాకినాడ జిల్లా సామర్లకోట ప్రముఖ క్షేత్రం కుమార రామ భీమేశ్వరుడి గ్రామోత్సవం నిర్వహించే రథానికి విశాఖకు చెందిన దాత జేవీవీ రావు సౌజ న్యంతో హైడ్రాలిక్ బ్రేక్లను ఏర్పాటు చేశారు.

మహాశివరాత్రి పర్వదినాల్లో కాకినాడ జిల్లా సామర్లకోట ప్రముఖ క్షేత్రం కుమార రామ భీమేశ్వరుడి గ్రామోత్సవం నిర్వహించే రథానికి విశాఖకు చెందిన దాత జేవీవీ రావు సౌజ న్యంతో హైడ్రాలిక్ బ్రేక్లను ఏర్పాటు చేశారు.

2 / 5
సాయంత్రం వాటి పనితీరును తెలుసుకునేందుకు ట్రయల్ రన్ వేసి అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ ఈవో బళ్ల నీలకంఠం, ధర్మకర్తల మండలి చైర్మన్ జగదీష్ మోహన్(బాబు) తదితర ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో హైడ్రాలిక్ బ్రేక్లు ఏర్పాటు చేశారు.

సాయంత్రం వాటి పనితీరును తెలుసుకునేందుకు ట్రయల్ రన్ వేసి అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ ఈవో బళ్ల నీలకంఠం, ధర్మకర్తల మండలి చైర్మన్ జగదీష్ మోహన్(బాబు) తదితర ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో హైడ్రాలిక్ బ్రేక్లు ఏర్పాటు చేశారు.

3 / 5
 ఇప్పటివరకూ రథోత్సవంలో భక్తులే చెక్క మోకులతో రథాన్ని నిలుపుదల చేసేందుకు వినియోగించేవారు. అయితే దాత హైడ్రాలిక్ బ్రేక్లను రూ పొందించారు. 2చక్రాలకు ఇరువైపులా బ్రేక్ లు ఏర్పాటు చేయడంతో రథం నిర్ణీత వేగంతో పయనించి భక్తులకు అసౌకర్యం లేకుండా రథోత్సవం విజయ వంతంగా నిర్వహించవచ్చని తెలిపారు.

ఇప్పటివరకూ రథోత్సవంలో భక్తులే చెక్క మోకులతో రథాన్ని నిలుపుదల చేసేందుకు వినియోగించేవారు. అయితే దాత హైడ్రాలిక్ బ్రేక్లను రూ పొందించారు. 2చక్రాలకు ఇరువైపులా బ్రేక్ లు ఏర్పాటు చేయడంతో రథం నిర్ణీత వేగంతో పయనించి భక్తులకు అసౌకర్యం లేకుండా రథోత్సవం విజయ వంతంగా నిర్వహించవచ్చని తెలిపారు.

4 / 5
ముందుగా షెడ్ నుంచి రథాన్ని శాస్త్రోక్తంగా పూజలు చేసి బయటకు తరలించి గాంధీ బొమ్మ వద్దకు చేర్చారు.,హైడ్రాలిక్ బ్రేకులు ఉండడంవల్ల రథోత్సవం జరిగే సమయంలో భక్తులకు ప్రమాదాలు జరగకుండా రథాన్ని నిలువరించే అవకాశం ఉంటుందని తెలిపారు ఆలయ నిర్వాహకులు.

ముందుగా షెడ్ నుంచి రథాన్ని శాస్త్రోక్తంగా పూజలు చేసి బయటకు తరలించి గాంధీ బొమ్మ వద్దకు చేర్చారు.,హైడ్రాలిక్ బ్రేకులు ఉండడంవల్ల రథోత్సవం జరిగే సమయంలో భక్తులకు ప్రమాదాలు జరగకుండా రథాన్ని నిలువరించే అవకాశం ఉంటుందని తెలిపారు ఆలయ నిర్వాహకులు.

5 / 5
Follow Us