AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంబైలో దారుణం: ఆక్సిజన్ కొరతతో.. ఏడుగురు కరోనా రోగులు మృతి..

ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రజా జీవనం స్తంభించిపోయింది. అర్తకవ్యవస్థలు అతలాకుతలమయ్యాయి.కరోనావైరస్

ముంబైలో దారుణం: ఆక్సిజన్ కొరతతో.. ఏడుగురు కరోనా రోగులు మృతి..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 31, 2020 | 4:13 PM

Share

Coronavirus In Maharashtra: ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రజా జీవనం స్తంభించిపోయింది. ఆర్థికవ్యవస్థలు అతలాకుతలమయ్యాయి.కరోనావైరస్ సంక్రమణ ముంబైలోని అనేక ఆసుపత్రులలో భయాందోళనలకు గురిచేస్తోంది. స్థానిక జోగేశ్వరి ఆసుపత్రిలో కరోనాకు సోకిన ఏడుగురు కేవలం 2 గంటల వ్యవధిలో మరణించారు. అయితే విచారణ చేయగా, దిగ్భ్రాంతి కలిగించే వాస్తవాలు బయటపడ్డాయి.

వివరాల్లోకెళితే.. ఏడుగురు కోవిద్ఆ-19 రోగులు ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో మరణించినట్లు తేలింది. గత వారం సమయంలో ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగా 12 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. సీనియర్ వైద్యుల కొరత ఎక్కువగా ఉందని, అందుకే కరోనా రోగులపై పర్యవేక్షణ చేయడం కుదరడం లేదని ఇతర వైద్య సిబ్బంది చెబుతున్నారు. కేవలం గంటన్నర వ్యవధిలో 7 మంది రోగులు మరణించారని తెలుస్తోంది.

కాగా.. కోవిద్-19 రోగుల పరిస్థితి విషమంగా ఉండటంతో, నర్సులు వెంటనే వైద్యుడికి సమాచారం ఇచ్చారు. ఐసియులో టెక్నీషియన్ సహాయంతో ఆక్సిజన్ స్థాయిని సరిచేసే సమయానికి, రోగులు మరణించారు. ఆసుపత్రిలో గందరగోళం నెలకొంది.మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మానే తెల్లవారుజామున 4:30 గంటలకు అత్యవసర సమావేశం నిర్వహించారు. అయితే, ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండటం వల్ల రోగులు మరణించడాన్ని డాక్టర్ ఖండించారు.

Also Read: త్వరలో.. మార్కెట్లోకి కరోనావైరస్ టెస్ట్ కిట్.. 10 నిమిషాల్లో ఫలితం..