AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ‌ర్భిణిగా ఉన్న కూతుర్ని చూసేందుకు కాలువ‌లో ఈత‌.. మ‌ధ్య‌లోనే ప్రాణాలు విడిచిన తండ్రి

క‌రోనా ప్ర‌పంచంలో మొత్తాన్నీ క‌ష్టాల్లోకి నెట్టింది. లాక్ డౌన్ కార‌ణంగా అవి మ‌రింత ఎక్కువ‌య్యాయి. ఈ క్ర‌మంలో కొన్ని హృదయ విదారక ఘ‌ట‌నలు కూడా చోటుచేసుకుంటున్నాయి. నిండు గర్భిణిగా ఉన్న కూతుర్ని చూడాలనుకున్న ఆ తండ్రి ఆశలు క‌ల‌గానే మిగిలిపోయాయి. రెండు ఊర్ల మధ్య ఉన్న కాలువలో గంట ఈతకొట్టి త‌న ప్రాణ‌మైన‌ కుమార్తెను చూసేస్తానని బయలు దేరిన తండ్రి..ఈదుతూనే ప్రాణాలు విడిచాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. తమిళనాడు ఈరోడ్​ జిల్లాలోని పల్లిపాలయానికి చెందిన పెరుమాళ్​(60) అనే వ్య‌క్తి […]

గ‌ర్భిణిగా ఉన్న కూతుర్ని చూసేందుకు కాలువ‌లో ఈత‌.. మ‌ధ్య‌లోనే ప్రాణాలు విడిచిన తండ్రి
Ram Naramaneni
| Edited By: |

Updated on: Apr 21, 2020 | 7:17 PM

Share

క‌రోనా ప్ర‌పంచంలో మొత్తాన్నీ క‌ష్టాల్లోకి నెట్టింది. లాక్ డౌన్ కార‌ణంగా అవి మ‌రింత ఎక్కువ‌య్యాయి. ఈ క్ర‌మంలో కొన్ని హృదయ విదారక ఘ‌ట‌నలు కూడా చోటుచేసుకుంటున్నాయి. నిండు గర్భిణిగా ఉన్న కూతుర్ని చూడాలనుకున్న ఆ తండ్రి ఆశలు క‌ల‌గానే మిగిలిపోయాయి. రెండు ఊర్ల మధ్య ఉన్న కాలువలో గంట ఈతకొట్టి త‌న ప్రాణ‌మైన‌ కుమార్తెను చూసేస్తానని బయలు దేరిన తండ్రి..ఈదుతూనే ప్రాణాలు విడిచాడు.

వివ‌రాల్లోకి వెళ్తే.. తమిళనాడు ఈరోడ్​ జిల్లాలోని పల్లిపాలయానికి చెందిన పెరుమాళ్​(60) అనే వ్య‌క్తి త‌న‌ కుమార్తె సుమతిని… హనూర్​ మండలం పుదుర్​ గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. ప్రస్తుతం ఆమె 9 నెలల గర్భిణి. కాన్పు సమయం కావడం వల్ల సుమతిని శనివారం మెట్టూరు హాస్పిట‌ల్ లో చేర్చారు. తొలి కాన్పు కావ‌డంతో కరోనా లాక్​డౌన్​ ఉన్నా పెరుమాళ్​ ఎలాగైనా కూత‌రును చూడాలని నిశ్చయించుకొన్నాడు. రెండు ఊర్ల మధ్య ఉన్న కాలువను ఈది ఆమె దగ్గరకు చేరుకోవాలని భావించాడు. తమిళనాడు-కర్ణాటక బోర్డ‌ర్స్ లో మైసూర్​-మెట్టూరు హైవేకి 200 మీటర్ల సమీపంలో ఉంటుందీ కాలువ. గంటసేపు ఈత కొడితే తమిళనాడులోని కరేకాడు చేరుకోవచ్చు. కొంత‌దూరం బాగానే వెళ్లిన పెరుమాళ్..మ‌ధ్య‌లో ఆయాసంతో ఈత కొట్టలేక కాలువలో మునిగి చనిపోయాడు. తమిళనాడులోని బరగూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో అతడి​ డెడ్ బాడీ దొరికింది.