రాంవిలాస్ పాశ్వాన్ అంత్యక్రియలు ముగిశాయి

లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్ అంత్యక్రియలు శనివారం సాయంత్రం ముగిశాయి. కొడుకు చిరాగ్ పాస్వాన్ తండ్రి చితికి నిప్పంటించారు.

రాంవిలాస్ పాశ్వాన్ అంత్యక్రియలు ముగిశాయి
Follow us

|

Updated on: Oct 10, 2020 | 6:57 PM

లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్ అంత్యక్రియలు శనివారం సాయంత్రం ముగిశాయి. కొడుకు చిరాగ్ పాస్వాన్ తండ్రి చితికి నిప్పంటించారు. పాట్నాలోని దిఘా ఘాట్‌లో అధికారికి లాంఛనాల నడుమ పాశ్వాన్ దహనసంస్కారాలు పూర్తి చేశారు. అంతకుముందు, పాట్నాలోని ఆయన నివాసం పాస్వాన్ పార్ధివదేహాన్ని ఆర్మీ వాహనంపై అంతిమయాత్ర సాగింది. అభిమానుల కన్నీటి వీడ్కోలు నడుమ అంతిమయాత్ర సాగింది.

శుక్రవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో పాట్నా చేరుకున్న పాశ్వాన్ మృతదేహానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విమానాశ్రయంలోనే నివాళి అర్పించారు. పాశ్వాన్ పార్ధివ దేహాన్ని చూసిన నితీష్ కన్నీటి పర్యంతమయ్యారు.. పాశ్వాన్ అంత్యక్రియల్లో పాల్గొన్న కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, నిత్యానందరాయ్, సీఎం నితీష్ కుమార్ తదితరులు దళిత నేతకు తుది వీడ్కోలు పలికారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాశ్వాన్ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కాగా, గుండె సంబంధిత వ్యాధి కారణంగా చికిత్స పొందుతూ కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ గురువారం సాయంత్రం తుది శ్వాస విడిచారు.