తెలంగాణ : ఇంగ్లీషు మీడియం విద్యార్థులకు తెలుగులోనూ పాఠాలు
ప్రైమరీ లెవల్లో పాఠాలు మాతృభాషలో అర్థం అయినట్లుగా ఇంగ్లీషులో అర్థం కావని చాలామంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana Government Schools : ప్రైమరీ లెవల్లో పాఠాలు మాతృభాషలో అర్థం అయినట్లుగా ఇంగ్లీషులో అర్థం కావని చాలామంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లీషు మీడియం మూడో తరగతి ‘పరిసరాల విజ్ఞానం’ పాఠ్య పుస్తకంలో పాఠాలను మొదటిసారి రెండు భాషల్లో( తెలుగు, ఆంగ్ల) భాషల్లో ప్రచురించింది. పుస్తకం ప్రతి పేజీలో పైన తెలుగులో, దిగువన ఇంగ్లీషులో ముద్రించింది. స్టూడెంట్స్ తెలుగులో పాఠం చదివి అర్థం చేసుకుని తర్వాత ఇంగ్లీషులో చదివి అవగాహన పెంపొందించుకుంటారనే లక్ష్యంతో ఇలా ముద్రించినట్లు అధికారులు తెలిపారు.
ఇంగ్లీషు మీడియంలో చదువుతున్న స్టూడెంట్స్ ఆంగ్లంలో పాఠ్యాంశాలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారంటూ గతంలో విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేసిన జనార్దన్రెడ్డి తన పరిశోదనలో తేల్చారు. రెండు భాషల్లో పాఠ్యాంశాలను ముద్రించాలని ‘రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి’కి అప్పట్లో ఆయన సూచించారు. స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీషు మీడియం మూడో తరగతి చదువుతున్న విద్యార్థులు 97 వేల మంది ఉన్నారు. తెలుగు మీడియం స్టూడెంట్స్కు కూడా ఇవే పుస్తకాలను పంపిణీ చేశారు.
Also Read : కాస్త రిలీఫ్ : స్వల్పంగా తగ్గిన బంగారం ధర !