కాస్త రిలీఫ్ : స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌ !

గ‌త కొద్ది రోజులుగా రికార్డులు క్రియేట్ చేస్తూ ప‌రుగులు పెట్టిన బంగారం ధ‌ర కాస్త బ్రేక్ ఇచ్చింది. ఈ రోజు గోల్డ్ రేటు స్వ‌ల్పంగా త‌గ్గింది. ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్‌లో ప‌సిడి ధ‌ర పెర‌గిన‌ప్ప‌టికీ, దేశీయ మార్కెట్‌లో మాత్రం గోల్డ్ రేటు త‌గ్గ‌డం గ‌మ‌నార్హం.

కాస్త రిలీఫ్ : స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌ !
Follow us

|

Updated on: Aug 10, 2020 | 7:43 AM

Today Gold Rate : గ‌త కొద్ది రోజులుగా రికార్డులు క్రియేట్ చేస్తూ ప‌రుగులు పెట్టిన బంగారం ధ‌ర కాస్త బ్రేక్ ఇచ్చింది. ఈ రోజు గోల్డ్ రేటు స్వ‌ల్పంగా త‌గ్గింది. ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్‌లో ప‌సిడి ధ‌ర పెర‌గిన‌ప్ప‌టికీ, దేశీయ మార్కెట్‌లో మాత్రం గోల్డ్ రేటు త‌గ్గ‌డం గ‌మ‌నార్హం. తాజాగా హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర విష‌యానికి వ‌స్తే…సోమవారం 10 గ్రామ్స్ 24 క్యారెట్స్ బంగారం ధర రూ.440 త‌గ్గింది . దీంతో ధర రూ.58,690కు పడిపోయింది. అదే సమయంలో 22 క్యారెట్స్ గోల్డ్ ధర కూడా క్షీణించింది. 10 గ్రామ్స్ బంగారం ధర రూ.400 క్షీణతతో రూ.53,800కు దిగొచ్చింది.

పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే బాట‌లో ప‌య‌నించింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2310 క్షీణించింది. దీంతో ధర రూ.74,200కు పడిపోయింది. నాణేపు తయారీదారులు, పరిశ్రమ యూనిట్ల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన రీజ‌న్‌గా చెప్పుకోవచ్చు.

ఇక ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్‌లో గోల్డ్ ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.8 శాతం పైకి ఎగ‌సింది. దీంతో గోల్డ్ ధర ఔన్స్‌కు 2034 డాలర్లకు చేరింది. బంగారంతో పాటే వెండి ధర కూడా అదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 2.69 శాతం పెరుగుదలతో 28.28 డాలర్లకు చేరింది.

ఇకపోతే బంగారం ధరపై చాలా అంశాలు ప్ర‌భావం చూపిస్తాయి. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరల‌ను ఎఫెక్ట్ చేస్తాయి.

Also Read : బంగా‌ళా‌ఖా‌తంలో అల్ప‌పీ‌డనం : తెలంగాణ‌లో విస్తారంగా వ‌ర్షాలు