చైనాతో యుద్ధ అవకాశాలను తోసిపుచ్చలేం: ఇండియన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్
చైనాతో యుద్ధానికి గల అవకాశాలను తోసిపుచ్చలేమని ఇండియన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ అన్నారు. తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన ధీన రేఖ (ఏల్ఏసీ) వెంబడి పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని ఆయన పేర్కొన్నారు. వాస్తవాధీన రేఖలో ఎలాంటి మార్పును భారత్ అంగీకరించేది లేదన్నారు. శుక్రవారం ఇరు దేశాల మధ్య 8వ రౌండ్ మిలటరీ స్థాయి చర్చలు మొదలైన నేపథ్యంలో రావత్ ఈ వ్యాఖ్యలు చేశారు. లద్దాఖ్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దుస్సాహసానికి పాల్పడి, ఊహించని ఫలితాన్ని […]

చైనాతో యుద్ధానికి గల అవకాశాలను తోసిపుచ్చలేమని ఇండియన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ అన్నారు. తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన ధీన రేఖ (ఏల్ఏసీ) వెంబడి పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని ఆయన పేర్కొన్నారు. వాస్తవాధీన రేఖలో ఎలాంటి మార్పును భారత్ అంగీకరించేది లేదన్నారు. శుక్రవారం ఇరు దేశాల మధ్య 8వ రౌండ్ మిలటరీ స్థాయి చర్చలు మొదలైన నేపథ్యంలో రావత్ ఈ వ్యాఖ్యలు చేశారు. లద్దాఖ్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దుస్సాహసానికి పాల్పడి, ఊహించని ఫలితాన్ని చవిచూడాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఉగ్రవాదాన్ని సరిహద్దులు దాటించేందుకు పాక్ జరిపే యత్నాలను కూడా భారత ఆర్మీ బలగాలు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నాయని చెప్పారు. భారత వ్యతిరేక శక్తులతో కలిసి జమ్మూకశ్మీర్పై పాకిస్థాన్ అప్రతిహతంగా పరోక్ష యుద్ధానికి పాల్పడుతోందని, దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు ఎన్నడూ లేనంతగా క్షీణించాయని అన్నారు. సరిహద్దు వివాదంపై చైనాతో అనేక విడతలుగా చర్చలు జరిపినా ఇంతవరకూ ఎలాంటి ఫలితం రాలేదని రావత్ స్పష్టం చేశారు.
