AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెజాన్‌కు రంగారెడ్డి జిల్లాలో భూ కేటాయింపులు

తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే భారీ పెట్టుబడి పెట్టిన అమెజాన్‌ సంస్థకు భూ కేటాయింపులు పూర్తయ్యాయి. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ మూడు ప్రాంతాల్లో అలైలబులిటీ జోన్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే...

అమెజాన్‌కు రంగారెడ్డి జిల్లాలో భూ కేటాయింపులు
Sanjay Kasula
| Edited By: |

Updated on: Nov 11, 2020 | 8:56 AM

Share

తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే భారీ పెట్టుబడి పెట్టిన అమెజాన్‌ సంస్థకు భూ కేటాయింపులు పూర్తయ్యాయి. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ మూడు ప్రాంతాల్లో అలైలబులిటీ జోన్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు రంగారెడ్డి జల్లాలోని రావిర్యాల ఫ్యాబ్‌ సిటీ లో 52.56ఎకరాలు, మీర్‌ఖాన్‌పేటలో 48.01ఎకరాలు, చందన్‌వెళ్లిలో 34.21ఎకరాలను టీఎస్‌ఐఐసీ కేటాయించింది.

వెబ్‌ సర్వీసెస్‌కు ప్రధానంగా విద్యుత్‌ ఎక్కువగా అవసరం కానుండటంతో 220కేవీ సబ్‌స్టేషన్లు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వెబ్‌ సర్వీసెస్‌ డాటా సెంటర్లను ఏర్పాటుచేయాలని అమెజాన్‌ నిర్ణయించింది.

2022 జూన్‌లోగా వీటి నిర్మాణాలు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు మరికొన్ని సంస్థలు ముందుకొస్తున్నాయి. దీనిపై త్వర లో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఆహా ర రంగం, ఆహార శుద్ధికి సంబంధించిన పరిశ్రమలు, ఇతర రంగాల పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నట్టు సమాచారం.