కరోనాతో సాకర్ ఫ్లేయర్ హంసకోయ మృతి

కరోనా వైరస్‌ బారిన పడి చికిత్స పొందుతున్న సంతోష్‌ ట్రోఫీ మాజీ ఫ్లేయర్ హంసకోయ (61) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయనతోపాటు ఆయన కుటుంబసభ్యులు ఐదుగురు కరోనా పాజిటివ్‌తో మంజేరిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం హంసకోయకి గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.

కరోనాతో సాకర్ ఫ్లేయర్ హంసకోయ మృతి
Follow us

|

Updated on: Jun 06, 2020 | 5:26 PM

కరోనా వైరస్‌ బారిన పడి చికిత్స పొందుతున్న సంతోష్‌ ట్రోఫీ మాజీ ఫ్లేయర్ హంసకోయ (61) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయనతోపాటు ఆయన కుటుంబసభ్యులు ఐదుగురు కరోనా పాజిటివ్‌తో మంజేరిలోని ఆస్పత్రిలోని కంటైన్మెంట్‌ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే శనివారం హంసకోయకి గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఈ నెల 21 న ముంబై నుంచి తిరువనంతపురం వచ్చిన హంసకోయ, ఇతర కుటుంబసభ్యులు సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారు. తొలుత ఆయన కోడలుకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారించి క్వారంటైన్ కి తరలించారు. అనంతరం హంసకోయతో పాటు కుటుంబసభ్యలకు కూడా పాజిటివ్‌గా తేలగా ప్రత్యేక వార్డుకు తరలి చికిత్స చేస్తున్నారు. అయితే ఆయనకు ఇతర సమస్యల కారణంగా ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్లాస్మా థెరపీ చేపట్టినా ఫలితం లేకపోయింది. చివరకు వెంటిలేటర్‌పై రెండురోజులపాటు కొనసాగిన హంసకోయకు గుండెపోటుతో మృతిచెందినట్లు తిరువనంతపురం వైద్యాధికారి డాక్టర్‌ కే సకీనా ధ్రువీకరించారు. మలబార్‌కు చెందిన హంసకోయ.. చిన్ననాటి నుంచే ఫుట్‌బాల్‌ అంటే మక్కువ. ఉన్నత విద్య చదివే రోజుల్లో కాలికల్‌ యూనివర్సిటీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. మహారాష్ట్ర తరఫున సంతోష్‌ ట్రోఫిలో 1981-86 లో పాల్గొన్నారు. అనంతరం జాతీయ జట్టులో చోటుసంపాదించి నెహ్రూ ట్రోపీలో కూడా ఆడారు. మోహన్‌ బగాన్‌, రైల్వేస్‌, టాటా స్పోర్ట్స్‌ వంటి అనేక క్లబ్బులకు ప్రాతినిధ్యం వహించారు. రిటైర్మెంట్‌ తర్వాత ముంబైలో స్థిరపడిన హంసకోయ మృతిపట్ల పలువురు క్రీడాకారులు సానుభూతి తెలిపారు.