AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“టీ సెల్స్”తో కరోనాకి చెక్..?

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాను జయించే శక్తి మానవులకు ఉందని స్వీడన్ సైటింస్టులు చెబుతున్నారు. మనషుల్ల్లో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి రెండింతల మందిలో ఉందని మానవ శరీరంలోన టీ సెల్స్‌ను పరిశీలించడం ద్వారా రుజువైందని కరోలిన్‌స్కా పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు.

టీ సెల్స్తో కరోనాకి చెక్..?
Balaraju Goud
|

Updated on: Jul 01, 2020 | 8:15 PM

Share

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాను జయించే శక్తి మానవులకు ఉందని స్వీడన్ సైటింస్టులు చెబుతున్నారు. మనషుల్ల్లో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి రెండింతల మందిలో ఉందని మానవ శరీరంలోన టీ సెల్స్‌ను పరిశీలించడం ద్వారా రుజువైందని కరోలిన్‌స్కా పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనావైరస్ నుండి కోలుకున్నవారిలో రోగనిరోధక శక్తి మొదట ఉన్నదానికంటే రెండు రెట్లు అధికంగా ఉండవచ్చంటున్నారు. మన శరీరం వ్యాధికి వ్యతిరేకంగా పోరాడే విధానాన్ని పరిశీలించిన తరువాత ఈ విషయం వెల్లడైందన్నారు. మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే తెల్లరక్తం కణాల సమూహన్ని “టీ సెల్స్‌” గా పిలుస్తారు. కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న రోగుల్లో ఆరోగ్యంగా ఉన్న 30 శాతం మందిలోని టీ సెల్స్‌ రోగ నిరోధక శక్తి పెరిగిందని, కరోనాను కట్టడి చేసేందుకు ఎంత శక్తి కావాలనేది ఇంకా సరియైన స్పష్టత రాలేదని నిపుణుల బృందం తెలిపింది. ఆ 30 శాతం మందిలో కరోనా రోగ లక్షణాలు కూడా కనిపించలేదని వారు చెప్పారు. కరోనా బారిన పడిన చిన్నపిల్లలు కోలుకోవడానికి టీ–సెల్స్‌ ఎంతగానో ఉపయోగపడ్డాయని, పిల్లల్లో అవి క్రియాశీలకంగా ఉంటాయని వైద్యులు వివరించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం యూరప్‌లో లాక్‌డౌన్‌ ప్రకటించని ఏకైక దేశం స్వీడన్‌. అయినప్పటికి గత వారం రోజుల్లో కరోనా బారిన పడి మరణించే వారి సంఖ్య పది శాతం తగ్గింది. స్వీడన్‌లో కరోనా బారిన పడిన వారి సంఖ్య 68,451లకు చేరుకోగా మృతుల సంఖ్య 5,333 చేరుకుంది. అయితే, ప్రస్తుతం 54,821 మందికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.