AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కీలక నిర్ణయం తీసుకున్న కర్నాటక ప్రభుత్వం.. జిమ్‌లు, హోటళ్లకు అనుమతి

ఇప్పటికే దేశ వ్యాప్తంగా దాదాపు 80 వేలకి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో కొద్ది రోజుల్లోనే ఈ కేసులు లక్షకి చేరుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం..

కీలక నిర్ణయం తీసుకున్న కర్నాటక ప్రభుత్వం.. జిమ్‌లు, హోటళ్లకు అనుమతి
restaurant
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 15, 2020 | 12:54 PM

Share

ఇప్పటికే దేశ వ్యాప్తంగా దాదాపు 80 వేలకి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో కొద్ది రోజుల్లోనే ఈ కేసులు లక్షకి చేరుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిమ్‌లు, గోల్ఫ్ క్లబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. మూడో దళ లాక్‌డౌన్ ముగిసిన వెంటనే వీటిని ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి సీటీ రవి తెలిపారు. వీటిని తెరిచే విషయమై సీఎం యడియూరప్పతో చర్చించినట్టు తెలిపారు.

దీంతో రెస్టారెంట్లు, హోటళ్లు తిరిగి ప్రారంభించే విషయంలో సీఎం కూడా సానుకూలంగా స్పందించినట్లు మంత్రి రవి పేర్కొన్నారు. ఈ నెల 17న లాక్‌డౌన్ గడువు ముగియనుంది. ఈ క్రమంలో కేంద్రం మరికొన్ని కొత్త మార్గదర్శకాలు విడుదలైన వెంటనే రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్లు, జిమ్‌లు తెరిచేందుకు పర్మిషన్ ఇస్తామని మంత్రి చెప్పారు. ఇప్పటికే కర్నాటక ప్రభుత్వం.. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో టీవీ సీరియల్స్ చేసేందుకు అనుమతి ఇచ్చింది.

కాగా ప్రస్తుతం కర్నాటకలో 987 కరోనా కేసులు నమోదు కాగా.. 35 మంది మృతి చెందారు. అలాగే 487 మంది ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా.. మరో 485 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Read More:

రైతులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. నేరుగా అకౌంట్లలో నగదు జమ

ఏపీలో జులై 10 నుంచి టెన్త్ పరీక్షలు.. ఏరోజు ఏ పరీక్షంటే!

కరెంట్ బిల్లులపై మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్