Jockey dies : హైదరాబాద్ రేస్ క్లబ్లో విషాదం…గుర్రంపై నుంచి జారిపడి జాకీ జితేందర్ సింగ్ మృతి
హైదరాబాద్ చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేస్ క్లబ్ (రేస్ కోర్స్) లో విషాదం చోటుచేసుకుంది. 4వ గుర్రపు రేస్ జరుగుతుండగా...
Jockey dies : హైదరాబాద్ చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేస్ క్లబ్లో జరిగిన రేస్లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. 4వ గుర్రపు రేస్ జరుగుతుండగా జితేందర్ సింగ్ అనే జాకీ గుర్రంపై నుంచి జారిపడటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. అలర్టైన నిర్వాహకులు వెంటనే స్థానిక యశోద ఆసుపత్రికి తరలించారు. అప్పటికే జాకీ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 23 ఏళ్ల వయసున్న జాకీ జితేందర్ సింగ్ రాజస్థాన్కి చెందినవాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించారు.
Also Read :
TSRTC : సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఇంటి వద్దకే బస్సు సర్వీసులు
Tragedy : పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు..కుటుంబం మొత్తాన్ని వెంటాడిన మృత్యువు..మరీ ఇలానా..?