AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాదాద్రి టెంపుల్ చీఫ్ ఆర్కిటెక్ట్‌ని అభినందించిన జనసేనాని

ఇటీవల హైదరాబాద్ లోని బిర్లా ఆడిటోరియమ్ లో శ్రీ శాంతికృష్ణ సేవా సమితి నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా సుప్రసిద్ధ కళా దర్శకులు, యాదాద్రి ఆలయ ముఖ్య ఆర్కిటెక్ట్ ఆనంద సాయి ‘ధార్మిక రత్న’ పురస్కారం స్వీకరించారు. ఈ పురస్కారం స్వీకరించిన క్రమంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ శుక్రవారం ఆనంద సాయిని అభినందించారు. పవన్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఆనంద సాయిని శాలువాతో సత్కరించారు. […]

యాదాద్రి టెంపుల్ చీఫ్ ఆర్కిటెక్ట్‌ని అభినందించిన జనసేనాని
Sanjay Kasula
|

Updated on: Oct 17, 2020 | 12:00 AM

Share

ఇటీవల హైదరాబాద్ లోని బిర్లా ఆడిటోరియమ్ లో శ్రీ శాంతికృష్ణ సేవా సమితి నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా సుప్రసిద్ధ కళా దర్శకులు, యాదాద్రి ఆలయ ముఖ్య ఆర్కిటెక్ట్ ఆనంద సాయి ‘ధార్మిక రత్న’ పురస్కారం స్వీకరించారు.

ఈ పురస్కారం స్వీకరించిన క్రమంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ శుక్రవారం ఆనంద సాయిని అభినందించారు. పవన్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఆనంద సాయిని శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ “శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణంలో ఎంతో నిష్టతో పాలుపంచుకోవడం ప్రశంసనీయం” అని అన్నారు. ఆలయ నిర్మాణం, సంబంధిత వాస్తు అంశాలపై ఎంతో పరిశోధన చేసిన ఆయనకు ధార్మిక రత్న పురస్కారం దక్కడం సముచితం “అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నటులు నర్రా శ్రీను ఆనంద్ సాయికి అబినందనలు తెలిపారు.