AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశమంతా హై అలర్ట్..!

స్వాతంత్రదినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు స్కెచ్‌ వేసినట్టు నిఘా వర్గాల సమాచారంతో.. దేశమంతా హై అలర్ట్ కొనసాగుతోంది. ఢిల్లీలో కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ రైల్వేస్టేషన్‌ నుంచి వెళ్లే రైళ్లలో పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర చేసినట్టు భారత నిఘా వర్గాల దగ్గర ఖచ్చితమైన సమాచారముంది. దీంతో ఢిల్లీతో సహా ప్రధాన నగరాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఢిల్లీలో ఉగ్రవాదుల ఫోటోలను గోడలపై అతికించారు. అనుమానాస్పద […]

దేశమంతా హై అలర్ట్..!
TV9 Telugu Digital Desk
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Aug 15, 2019 | 8:09 AM

Share

స్వాతంత్రదినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు స్కెచ్‌ వేసినట్టు నిఘా వర్గాల సమాచారంతో.. దేశమంతా హై అలర్ట్ కొనసాగుతోంది. ఢిల్లీలో కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ రైల్వేస్టేషన్‌ నుంచి వెళ్లే రైళ్లలో పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర చేసినట్టు భారత నిఘా వర్గాల దగ్గర ఖచ్చితమైన సమాచారముంది. దీంతో ఢిల్లీతో సహా ప్రధాన నగరాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఢిల్లీలో ఉగ్రవాదుల ఫోటోలను గోడలపై అతికించారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఎర్రకోటతో సహా పలు ప్రాంతాల్లో అడుగడుగునా భద్రతా బలగాలను మోహరించారు. ఇక జమ్ముకశ్మీర్‌లో కూడా హై అలర్ట్‌ కొనసాగుతోంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా హైఅలర్ట్‌ కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌ నుంచి దేశంలోకి చొరబడ్డ ఉగ్రవాదులు భారీ విధ్వంసం సృష్టించే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో బస్టాండ్‌లు , రైల్వేస్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. గౌహతి రైల్వేస్టేషన్‌లో భారీగా తనిఖీలు చేపట్టారు. బాంబ్‌ స్క్వాడ్‌ , డాగ్‌ స్క్వాడ్‌లతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమానితులతో అదుపు లోకి తీసుకొని ప్రశ్నించారు.