AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇరాన్‌లో కరోనా మరణమృదంగం.. 24 గంటల్లో 49 మంది..!

చైనాలో ప్రాణం పోసుకొని 73దేశాలను గడగడలాడిస్తోంది కరోనావైరస్. ఇప్పుడు ఇరాన్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 49 మంది మృతి చెందినట్లు ఆ దేశ అధికారులు ఆదివారం ధృవీకరించారు.

ఇరాన్‌లో కరోనా మరణమృదంగం.. 24 గంటల్లో 49 మంది..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 08, 2020 | 10:27 PM

Share

చైనాలో ప్రాణం పోసుకొని 73దేశాలను గడగడలాడిస్తోంది కరోనావైరస్. ఇప్పుడు ఇరాన్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 49 మంది మృతి చెందినట్లు ఆ దేశ అధికారులు ఆదివారం ధృవీకరించారు. కాగా కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు ఆ దేశంలో మొత్తం 194 మంది మరణించారు. వైరస్‌ కారణంగా ఇరాన్‌ మాజీ దౌత్యాధికారి హోసేన్ షేఖోస్లామ్ ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ వార్త మరువముందుకే మరో ప్రజాప్రతినిధిని కరోనా కబలించింది. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు ఫతేమహ్ రహబర్ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయినట్టు ఇరాన్‌ వెల్లడించింది.

కోవిద్ 19 వైరస్ చైనాతో పాటు ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియాలో మరణమృదంగం మోగిస్తోంది. ఇరాన్ లో ఇప్పటి వరకు 194 మంది చనిపోగా, 5 వేలకుపైగా కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు ఇటలీలోనూ కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆ దేశంలో కరోనా ధాటికి ఇప్పటి వరకు 234 మృతి చెందగా.. 1247 కరోనా కేసులు నమోదయ్యాయి.

Follow Us