ఏపీలోని మోడల్ స్కూళ్లలో.. ఇంటర్ అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పెంపు!
కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్కూళ్ళు, కాలేజీలు ఇంకా ప్రారంభ కాలేదు. ఈ క్రమంలో పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి ఏపీ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్లలో
కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్కూళ్ళు, కాలేజీలు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ క్రమంలో పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి ఏపీ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్లలో ఇంటర్ అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పొడిగించింది. మామూలుగా నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు గడువు 2020 జూలై 31తో ముగియాలి. కానీ ఈ గడువును ఆగస్టు 25, 2020 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆసక్తిగల విద్యార్థులు ఆగస్ట్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కొత్త షెడ్యూల్ త్వరలో అందుబాటులోకి రానుంది. బాలికలకు 33.33 శాతం ప్రాధాన్యత ఇస్తారు. టెన్త్ పాసైన విద్యార్థులు 2020-21 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందొచ్చు. విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు https://apms.apcfss.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
Read More:
కరోనా ఎఫెక్ట్: మెరుగైన సేవలకోసం.. 104 కాల్ సెంటర్
మొబైల్ ఫోన్కే కరోనా పరీక్ష ఫలితాలు.. ఓటీపీ వచ్చాకే శాంపిళ్ల సేకరణ