AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో 1 మిలియ‌న్ దాటిన కరోనా కేసులు..గ‌డిచిన 24 గంట‌ల్లో 687 మంది మృతి

దేశంలో క‌రోనా క‌ల్లోలం కొనసాగుతోంది. కేసుల ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. గ‌డిచిన 24 గంటల్లో రికార్డు రేంజ్ లో 34,956 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఈ సంఖ్యే టాప్.

దేశంలో 1 మిలియ‌న్ దాటిన కరోనా కేసులు..గ‌డిచిన 24 గంట‌ల్లో 687 మంది మృతి
Ram Naramaneni
|

Updated on: Jul 17, 2020 | 9:51 AM

Share

దేశంలో క‌రోనా క‌ల్లోలం కొనసాగుతోంది. కేసుల ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. గ‌డిచిన 24 గంటల్లో రికార్డు రేంజ్ లో 34,956 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఈ సంఖ్యే టాప్. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1 మిలియ‌న్ దాటింది. కొత్త‌గా మ‌రో 687 మంది కోవిడ్ కార‌ణంగా ప్రాణాలు విడిచారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్ ప్రకారం దేశ‌వ్యాప్తంగా కోవిడ్-19 వివ‌రాలు :

దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,03,832

దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 3,42,473

కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 6,35,757

దేశవ్యాప్తంగా మొత్తం కరోనాతో మృతి చెందినవారి సంఖ్య : 25,602

ఇక రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే.. మహారాష్ట్రలో కరోనా​ వీర‌విహారం చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,84,281కి చేరింది. 11,194 మంది వైరస్​ వ‌ల‌న మ‌ర‌ణించారు. తమిళనాడులో కోవిడ్-19 కేసులు 1,56,369గా ఉంది. 2,236 మంది వైర‌స్ కార‌ణంగా బ‌ల‌య్యారు. ఢిల్లీలో క‌రోనా బాధితుల సంఖ్య 1,18,645 మందికి క‌రోనా సోకింది. మొత్తంగా 3,545 మంది మ‌ర‌ణించారు. గుజరాత్​లో మొత్తంగా 45,481 మందికి కరోనా సోక‌గా.. 2,089 మంది వ్యాధి కార‌ణంగా ప్రాణాలు విడిచారు.